పటేల్ ప్రధాని అయ్యుంటే భారత్.. మరో పాక్ అయ్యేది: కంచె ఐలయ్య
న్యూఢిల్లీ: సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత దేశ తొలి ప్రధానమంత్రి అయి ఉంటే భారత దేశం మరో పాకిస్తాన్ అయి ఉండేదని ప్రముఖ రచయిత కంచె ఐలయ్య ఆదివారం నాడు వ్యాఖ్యానించారు. మన ప్రజాస్వామ్యం కుప్పకూలేదని అభిప్రాయపడ్డారు.
టైమ్స్ లిట్ ఫెస్ట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారని గుర్తు చేశారు. పటేల్ తొలి ప్రధాని అయితే భారత్ మరోలా ఉండేదని ప్రధాని మోడీ అన్నారని కంచె ఐలయ్య అన్నారు.

అతనే తొలి ప్రధాని అయితే భారత్ మరో పాకిస్తాన్ అయ్యేదని వ్యాఖ్యానించారు. అతను డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ను రాజ్యాంగం రాసేందుకు అనుమతించేవాడు కాదన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ హిందూ మహాసభకు దగ్గరగా ఉండేవాడని, మనుస్మృతిని నమ్మిన వారే రాయాలని ఆయన భావించేవారన్నారు.
కాగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ పైన కంచె ఐలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పటేల్ భారత దేశ తొలి హోంమంత్రి. దేశంలోని అనేక సంస్థాలను ఏకతాటి పైకి తెచ్చారు. హైదరాబాద్ సంస్థానంను కూడా భారత్లో కలపడంలో పటేల్ పాత్ర ఎంతో ఉంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications