గోదావరిఖనిలో దారుణం: లెక్చరర్ 'ప్రేమ' వేధింపులకు విద్యార్థిని బలి!
కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న చిట్యాల రోహిత్ అనే వ్యక్తి సౌమ్యను కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది.
గోదావరిఖని: విద్యాబుద్దులు నేర్పించాల్సిన అధ్యాపకులే విద్యార్థులను ప్రేమ పేరుతో వేధిస్తున్న ఘటనలు ఈమధ్య కాలంలో చాలానే బయటపడుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో లెక్చరర్ ప్రేమ వేధింపులకు ఓ విద్యార్థిని అన్యాయంగా బలైపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో ఉన్న గౌతమి సాయి డిగ్రీ కళాశాలలో సౌమ్య అనే విద్యార్థిని ఇటీవలే మొదటి సంవత్సరం పూర్తి చేసింది. అయితే ఇదే కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న చిట్యాల రోహిత్ అనే వ్యక్తి సౌమ్యను కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది.

ఇదే విషయం సౌమ్య ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పినట్లు సమాచారం. అయితే ఇటీవల వేధింపులు మరింత ఎక్కువవడంతో సోమవారం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయ్ నగర్ లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడగా.. హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో.. అక్కడినుంచి హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ సౌమ్య మంగళవారం నాడు ప్రాణాలు విడిచింది. సౌమ్య మరణంతో లెక్చరర్ రోహిత్ ను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications