ఇబ్బంది పెట్టకండి, మాఫీ చేసి కొత్తవి ఇవ్వండి: మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టవద్దని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు శుక్రవారం సూచించారు. రైతుల రుణాల పైన ఆయన స్పందించారు. బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా రుణమాఫీ చేసి కొత్త రుణాలివ్వాలన్నారు.
రైతుల నుంచి వడ్డీ వసూలు చేయవద్దని ఆదేశించారు. బ్యాంకర్లు ప్రభుత్వ గైడ్లైన్స్ను పాటించాలన్నారు. రైతులకు అసౌకర్యం కల్గించకుండా బ్యాంకర్లు వ్యవహరించాలని సూచించారు.

పుష్కరాలపై జగదీశ్వర్ రెడ్డి
నల్గొండ జిల్లాలో కృష్ణా పుష్కరాలకు కోటిన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు మంత్రి జగదీశ్వర్ రెడ్డి వేరుగా తెలిపారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 45 ఘాట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గోదావరి పుష్కరాలు నిర్వహించిన అనుభవంతో మరింత విజయవంతంగా కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తామన్నారు.
అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పుష్కరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. పీఏపల్లి, చందంపేట సహా మారుమూల మండలాల్లోనూ ఘాట్లు నిర్మిస్తామన్నారు.
కృష్ణా నది లోతుగా ప్రవహిస్తుంది కాబట్టి అనువైన ప్రదేశాల్లోనే ఘాట్లు నిర్మిస్తున్నామన్నారు. పుష్కరాల్లో తాగునీటితో పాటు శానిటేషన్ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో చారిత్రక ఆలయాలు ఉన్న చోట శాశ్వత నిర్మాణాలు చేపడుతామన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications