కేసీఆర్ ను టచ్ చేస్తే - హరీష్ హెచ్చరిక..!!
తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ కు నోటీసుల వ్యవహారం సంచలనంగా మారింది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణ చేస్తోంది. పలువురు రాజకీయ ప్రముఖులతో పాటుగా ఆ సమయంలో కీలక హోదాల్లో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను విచారణ చేసింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ ను సిట్ విచారించి వారి నుంచి సమాచారం సేకరణ చేసింది. కాగా.. ఇప్పుడు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటం పైన బీఆర్ఎస్ నేతలు మండి పడుతున్నారు. సీఎం రేవంత్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు విచారణ సమయంగా నిర్దేశించింది. పోలీసు స్టేషన్ కు అవసరం లేదని.. ఎక్కడైనా విచారణ స్థలం ఖరారు చేస్తే అక్కడికే వస్తామని సిట్ టీం సమాచారం పంపింది. ఇప్పడు సిట్ సూచన పైన కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, కేసీఆర్ కు నోటీసుల పై మాజీ మంత్రి హరీష్ సీరియస్ అయ్యారు. కోట్లాది మంది ప్రజల ఆరాధ్యుడైన కేసీఆర్పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని మాజీ మంత్రి హరీశ్ రావు కొనియాడారు.

బీఆర్ఎస్ నేతల సీరియస్
పరిపాలనలో చేతకానితనంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ చర్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర, చౌకబారు రాజకీయాలకు రేవంత్ పరాకాష్ట అంటూ ఫైర్ అయ్యారు. దీనికి కొనసాగింపుగా రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్ అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడుగా రేవంత్ మిగిలి పోతారని వ్యాఖ్యానించారు. అధికారం, అహంకారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలని హరీష్ సూచించారు. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వెంటే ఉందని వెల్లడించారు. ఈ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని.. ప్రజలే తగిన బుద్ధి చెబుతారంటూ హరీశ్ రావు హెచ్చరించారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications