రెండు రాష్ట్రాల సౌభాగ్యం: తిరుమలలో హరీశ్, తుమ్మల పూజలు(పిక్చర్స్)
తిరుపతి: తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, తుమ్మల నాగేశ్వరరావులు ఆదివారం ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం విరామ సమయంలో మంత్రులిద్దరూ సకుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించేలా అనుగ్రహించాలని ఏడుకొండలవాడిని కోరుకున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల పర్యటన ఇంకా ఖరారు కాలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
మంత్రి హరీశ్ శనివారం విమానంలో రేణిగుంటకు వచ్చి కుటుంబసభ్యులతో కలిసి అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకోగా, తుమ్మల నాగేశ్వరరావు కుటుంబసభ్యులతో రోడ్డు మార్గంలో తిరుమలకు వచ్చారు. మంత్రులకు టీటీడీ అధికారులు ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం, దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆ తర్వాత స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని ఆదివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం ఈవో పెనుమాక పూర్ణచంద్రరావు, అర్చకులు రాజగోపురం వద్ద స్వాగతం పలికారు.
అనంతరం వారు స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం హరీష్రావు కుటుంబ సభ్యులకు స్వామివారి పట్టువస్త్రాలు, తీర్థప్రసాదాలు, స్వామివారి జ్ఞాపికను ఈవో అందించారు. మూషిక మంపడంలో వేదపండితులు వారిని ఆశీర్వదించారు. ప్రాంగణంలోని వీరాంజనేయస్వామి, నవగ్రహాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

తిరుమలలో తుమ్మల
తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, తుమ్మల నాగేశ్వరరావులు ఆదివారం ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.

ఫ్యామిలీతో హరీశ్ రావు
శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం విరామ సమయంలో మంత్రులిద్దరూ సకుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుమలలో హరీశ్ రావు
దర్శనం అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించేలా అనుగ్రహించాలని ఏడుకొండలవాడిని కోరుకున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల పర్యటన ఇంకా ఖరారు కాలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

శ్రీవారిసేవలో మంత్రులు
మంత్రి హరీశ్ శనివారం విమానంలో రేణిగుంటకు వచ్చి కుటుంబసభ్యులతో కలిసి అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకోగా, తుమ్మల నాగేశ్వరరావు కుటుంబసభ్యులతో రోడ్డు మార్గంలో తిరుమలకు వచ్చారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications