ధర్మాసనం వైపు దూసుకెళ్లాడు: ఎంపీ వీహెచ్పై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) వీసీ అప్పారావును తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.
దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, హెచ్సీయూ వీసికి నోటీసులు జారీచేసింది. యూనివర్శిటీలోకి బయటి వ్యక్తులు వెళ్లాల్సిన అవసరం ఏంటని న్యాయస్థానం ప్రశ్నించింది.

ఇది ఇలా ఉండగా, విచారణ జరుగుతున్న సమయంలో వి హనుమంతరావు వ్యవహార శైలిపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వాదనలు కొనసాగుతుండగా వీహెచ్ కల్పించుకుని నేరుగా ధర్మాసనంతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. న్యాయమూర్తి ఎంత వారించినా వీహెచ్ ప్రవర్తనలో మార్పురాకపోవడంతో పోలీసులను లోనికి పిలిపించారు. ఆయనను బయటికి తీసుకెళ్లారు. కేసు విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేశారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications