స్మితా సబర్వాల్కు కోర్టు ఖర్చులపై వివరణ ఇవ్వండి: మరోసారి గడువు కోరవద్దన్న హైకోర్టు
హైదరాబాద్: ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్కు 'ఔట్లుక్ మ్యాగజైన్' కథనం వివాదంలో న్యాయపరమైన ఖర్చుల కోసం.. రూ.15లక్షలు మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో 'తెలంగాణ సర్కారు' ప్రమాణపత్రం దాఖలకు హైకోర్టు మరోసారి గడువిచ్చింది.
కౌంటర్ దాఖలుకు గడువు కోరడం ఇది రెండోసారని.. మరోసారి సమయం కోరకుండా ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్జీపీ) బి.మహేందర్రెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబరు 16కు వాయిదా వేసింది.

ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ఎస్వీ భట్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఎస్జీపీ మహేందర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వ్యాజ్యాల్లో ప్రమాణపత్రం దాఖలుకు మరికొంత సమయం కావాలన్నారు.
పిటిషనర్ ఈశ్వరరావు తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి స్పందిస్తూ.. స్మితాసబర్వాల్కు కూడా నోటీసులు జారీచేసి, ప్రమాణపత్రం దాఖలు చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. నోటీసుల అవసరం అనుకుంటే తగిన సమయంలో జారీచేస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications