గన్ పట్టుకున్న సీఎం, లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు
దేశంలో దశాబ్దాలుగా వినిపిస్తున్న తుపాకుల మోతకు ముగింపు పలకడమే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ ముగింపు దశకు చేరుకుంది. శనివారం (మార్చి 7, 2026) హైదరాబాద్లోని బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఒక అసాధారణ పరిణామం రాష్ట్రంలో మావోయిజం అంతానికి నాంది పలికింది. ఏకంగా 130 మంది మావోయిస్టులు తమ ఆధునిక ఆయుధాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. సాధారణంగా పోలీసు అధికారుల ముందు లొంగిపోవడం ఆనవాయితీ కాగా, నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ముందే భారీ సంఖ్యలో కేడర్ సరెండర్ అవ్వడం ఇదే తొలిసారి.
నాలుగు బస్సుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్న మావోయిస్టులు, సీఎం రేవంత్ రెడ్డికి ఏకే-47 (AK-47), ఇన్సాస్ (INSAS), ఎస్ఎల్ఆర్ (SLR) వంటి 124 అత్యాధునిక ఆయుధాలను అప్పగించారు. స్వయంగా గన్ చేతబట్టి వాటిని పరిశీలించిన రేవంత్ రెడ్డి, హింస ఏ సమస్యకూ పరిష్కారం కాదని, ప్రజాస్వామ్య మార్గంలోనే అభివృద్ధి సాధ్యమని నిరూపించారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులతో పాటు మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, బడే చొక్కారావు వంటి వారి గన్మెన్లు, కంప్యూటర్ సిగ్నల్ ఆపరేటర్లు ఉండటం గమనార్హం. మావోయిస్టు పార్టీకి అత్యంత కీలకమైన పీఎల్జీఏ (PLGA) బెటాలియన్ మొత్తం ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసింది.

పీపుల్స్ వార్ టు పీపుల్స్ గవర్నమెంట్
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన 'శాంతి పిలుపు'కు స్పందిస్తూనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు మావోయిస్టు నేతలు వెల్లడించారు. ఈ భారీ లొంగుబాటుతో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్కు చెందిన 125 మంది సభ్యులు ఇక్కడ లొంగిపోవడం ద్వారా, పొరుగు రాష్ట్రాల్లో కూడా మావోయిజం క్రమంగా బలహీనపడుతోందని స్పష్టమవుతోంది. లొంగిపోయిన వారికి తక్షణమే పునరావాస ప్యాకేజీల కింద రివార్డు చెక్కులను సీఎం అందజేశారు.
Maoists రహస్య చర్చలు.. ఫలించిన వ్యూహం
ఇటీవలే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన రేవంత్ రెడ్డి, అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను బయటకు తీసుకురావడంపై కీలక చర్చలు జరిపారు. ఆ చర్చల ఫలితంగానే అధికారుల సమన్వయంతో ఇంత పెద్ద సంఖ్యలో కేడర్ జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. "ఆయుధాలు పక్కన పెట్టి రండి, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది" అని రేవంత్ రెడ్డి ఇచ్చిన భరోసా మావోయిస్టుల్లో మార్పు తెచ్చింది. లొంగిపోయిన వారందరికీ ఆరోగ్యశ్రీ, గృహ వసతి, జీవనోపాధి కల్పిస్తామని సీఎం వాగ్దానం చేశారు.
#WATCH | Hyderabad, Telangana: In the presence of Chief Minister Revanth Reddy, 130 Maoists surrendered with their weapons.
— ANI (@ANI) March 7, 2026
Those who surrendered included 3 State Committee members, 1 Regional Committee member, 10 Divisional Committee members, 46 Area Committee members, and 70… pic.twitter.com/6g2a3laWNo
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
భద్రాద్రి రాముడికి మహర్దశ: ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లు విడుదల! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications