Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గన్ పట్టుకున్న సీఎం, లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు

దేశంలో దశాబ్దాలుగా వినిపిస్తున్న తుపాకుల మోతకు ముగింపు పలకడమే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ ముగింపు దశకు చేరుకుంది. శనివారం (మార్చి 7, 2026) హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఒక అసాధారణ పరిణామం రాష్ట్రంలో మావోయిజం అంతానికి నాంది పలికింది. ఏకంగా 130 మంది మావోయిస్టులు తమ ఆధునిక ఆయుధాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. సాధారణంగా పోలీసు అధికారుల ముందు లొంగిపోవడం ఆనవాయితీ కాగా, నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ముందే భారీ సంఖ్యలో కేడర్ సరెండర్ అవ్వడం ఇదే తొలిసారి.

నాలుగు బస్సుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్న మావోయిస్టులు, సీఎం రేవంత్ రెడ్డికి ఏకే-47 (AK-47), ఇన్సాస్ (INSAS), ఎస్ఎల్ఆర్ (SLR) వంటి 124 అత్యాధునిక ఆయుధాలను అప్పగించారు. స్వయంగా గన్ చేతబట్టి వాటిని పరిశీలించిన రేవంత్ రెడ్డి, హింస ఏ సమస్యకూ పరిష్కారం కాదని, ప్రజాస్వామ్య మార్గంలోనే అభివృద్ధి సాధ్యమని నిరూపించారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులతో పాటు మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, బడే చొక్కారావు వంటి వారి గన్‌మెన్లు, కంప్యూటర్ సిగ్నల్ ఆపరేటర్లు ఉండటం గమనార్హం. మావోయిస్టు పార్టీకి అత్యంత కీలకమైన పీఎల్జీఏ (PLGA) బెటాలియన్ మొత్తం ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసింది.

Historic Surrender 130 Maoists Lay Down 124 Advanced Arms Before CM Revanth Reddy in Hyderabad

పీపుల్స్ వార్ టు పీపుల్స్ గవర్నమెంట్

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన 'శాంతి పిలుపు'కు స్పందిస్తూనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు మావోయిస్టు నేతలు వెల్లడించారు. ఈ భారీ లొంగుబాటుతో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 125 మంది సభ్యులు ఇక్కడ లొంగిపోవడం ద్వారా, పొరుగు రాష్ట్రాల్లో కూడా మావోయిజం క్రమంగా బలహీనపడుతోందని స్పష్టమవుతోంది. లొంగిపోయిన వారికి తక్షణమే పునరావాస ప్యాకేజీల కింద రివార్డు చెక్కులను సీఎం అందజేశారు.

Maoists రహస్య చర్చలు.. ఫలించిన వ్యూహం

ఇటీవలే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన రేవంత్ రెడ్డి, అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను బయటకు తీసుకురావడంపై కీలక చర్చలు జరిపారు. ఆ చర్చల ఫలితంగానే అధికారుల సమన్వయంతో ఇంత పెద్ద సంఖ్యలో కేడర్ జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. "ఆయుధాలు పక్కన పెట్టి రండి, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది" అని రేవంత్ రెడ్డి ఇచ్చిన భరోసా మావోయిస్టుల్లో మార్పు తెచ్చింది. లొంగిపోయిన వారందరికీ ఆరోగ్యశ్రీ, గృహ వసతి, జీవనోపాధి కల్పిస్తామని సీఎం వాగ్దానం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+