ప్రభుత్వం ఇచ్చిన 1500 నగదు కోసం బ్యాంకుల వద్ద భారీ క్యూ .. కామారెడ్డిలో మహిళ మృతి
కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో ఆర్ధిక భరోసా ఇస్తూ తెలంగాణా సర్కార్ తీసుకున్న నిర్ణయం మేరకు డబ్బు ఖాతాలో వెయ్యటంతో నిరుపేద లబ్దిదారులు బ్యాంకుల ముందు క్యూ కట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యంలో నిరుపేదలైన వారి కోసం తెలంగాణా ప్రభుత్వం ఉచిత రేషన్ ఇస్తామని, అలాగే 1500 రూపాయలు నగదు ఇస్తామని చేసిన ప్రకటన మేరకు ఆ నగదును బ్యాంకుల్లో జమ చేసింది.దీంతో బ్యాంకుల వద్ద ఆ నగదు కోసం జనాలు భారీగా క్యూ కట్టారు. ఇదే సమయంలో ఒక మహిళ మృతి చెందటం విషాదంగా మారింది.
తక్కువ ఆదాయం గల తెల్ల రేషన్ కార్డు ఉన్నవారి బ్యాంకు ఖాతాల్లో రూ.1500 జమ చేసిన నేపధ్యంలో ఆ నగదు తీసుకోవటం కోసం ప్రజలు బ్యాంకులకు వెళ్తున్నారు. లాక్డౌన్తో ప్రజలు ఇబ్బంది పడకుండా ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసిన ప్రభుత్వం దానితో పాటు రేషన్ కార్డుపై రూ.1500 చొప్పున బ్యాంకుల్లో జమ చేసింది. ఆ డబ్బుల కోసం బ్యాంకు దగ్గరకు వెళ్లి క్యూ లైన్ లో నిలబడిన ఓ మహిళ ప్రాణం కోల్పోవటం విషాదంగా మారింది. కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటన స్థానిక ప్రజలకు ఆవేదన కలిగిస్తుంది .

ఇక అసలేం జరిగిందంటే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వద్ద ప్రభుత్వం అందిస్తున్న రూ. 15 వందలు తీసుకోవడానికి చాలా మంది లబ్దిదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో బ్యాంక్ దగ్గర భారీ క్యూ లైన్ పెరిగింది. అయితే కన్నపూర్ తండాకు చెందిన నేనావత్ కమల(45) అనే మహిళ కూడా క్యూలైన్లో నగదు విత్ డ్రా కోసం నిలబడింది . ఉదయం నుంచి డబ్బులు తీసుకోవడానికి క్యూలో నిలబడిన కమల హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందింది . ఒక్కసారిగా ఆమెకు గుండె పోటు రావటంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. కమల గుండెపోటు రావడంతో మృతిచెందినట్టు చెబుతున్నారు వైద్యులు. ఇక ఈ సంఘటనతో బ్యాంకు అధికారులు కూడా విచారం వ్యక్తం చేశారు . మరోవైపు, బ్యాంకు వద్ద ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కమల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications