డ్రగ్ కేసు: నటుల డైలమా, వారి కోసం వేట! కేసీఆర్ కీలక నిర్ణయం
డ్రగ్స్ మాఫియా కేసు విచారణను సిట్ ముమ్మరం చేసింది. ఈ కేసులో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులను బుధవారం నుంచి విచారించనుంది. విచారణకు హాజరు కావాలని సిట్ నుంచి పలువురు నటీనటులకు నోటీసులు వెళ్లాయి.
హైదరాబాద్: డ్రగ్స్ మాఫియా కేసు విచారణను సిట్ ముమ్మరం చేసింది. ఈ కేసులో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులను బుధవారం నుంచి విచారించనుంది. విచారణకు హాజరు కావాలని సిట్ నుంచి పలువురు నటీనటులకు నోటీసులు వెళ్లాయి.

ఏం చేద్దాం
ఈ నేపథ్యంలో సిట్ విచారణకు హాజరు కావాలా? హాజరైతే ఎలా వ్యవహరించాలనే దానిపై నోటీసులు అందుకున్న ప్రముఖులు డైలమాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వారు సరైన లాయర్ కోసం వేట మొదలు పెట్టారని తెలుస్తోంది.

రేపటి నుంచి విచారణ
లాయర్ల నుంచి న్యాయ సలహా తీసుకున్న అనంతరం సిట్ విచారణకు హాజరు కావాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 19వ తేదీ నుంచి వరుసగా ప్రముఖులను విచారించనున్నారు.
Recommended Video


వరుసగా వీరు..
ఈ నెల 19వ తేదీన పూరీ జగన్నాథ్, 20న చార్మి, 21న ముమైత్ ఖాన్, 22న నటుడు సుబ్బరాజు, 23న కెమెరామెన్ శ్యాం కే నాయుడు సిట్ ఎదుట హాజరు కానున్నారు. రవితేజ కూడా ఈ నెల 24న హాజరు కానున్నారు. 26న ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, 26న నవదీప్, 27న తరుణ్, 28న తనీష్, నందులను విచారించనున్నారు.

219 మంది అధికారుల బదలీ
ఓ వైపు డ్రగ్స్ కేసులో విచారణ జరుగుతుండగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖలో 219 మంది అధికారులను బదలీ చేస్తున్నట్లు ఉదయం ఉత్తర్వులు వచ్చాయి. 23 మంది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 196 మంది ఇన్స్పెక్టర్లను బదలీ చేస్తూ జీవో విడుదల చేశారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications