కిడ్నాప్ డ్రామా: పోలీసులను పరుగు పెట్టించాడు
హైదరాబాద్: తనను కిడ్నాప్ చేశారంటూ ఫోన్ చేయించి పోలీసులను పరుగులు పెట్టించాడు ఓ వ్యక్తి. సూరారంకు చెందిన రమేష్ కార్పెంటర్గా పని చేస్తున్నాడు. మంగళవారం నాడు విజయ్ తన బావమరిదితో 100కు ఫోన్ చేయించి ఓ కారులో కిడ్నాప్ చేసినట్లు తప్పుడు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసు కంట్రోల్ రూం నుండి దుండిగల్, మియాపూర్ పోలీసులను అప్రమత్తం చేశారు. వారు అరగంటలో కారు పట్టుకున్నారు. అసలు విషయం తెలుసుకొని ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ చేయాలని వారించి వదిలేశారు.
సెక్యూరిటీ గార్డుల అరెస్టు
పంజాగుట్టలో ఆయుధాలు చూపించి దోపిడీ చేసిన వ్యవహారంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులను పోలీసుల అరెస్టు చేశారు. సెక్యూరిటి గార్డుల నుండి రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.
విధి నిర్వహణలో పోలీస్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి
నల్గొండలోని రూరల్ పోలీస్ స్టేషన్లో విధి నిర్వహణలో ఓ పోలీస్ కానిస్టేబుల్ గుండెపోటుతో మంగళవారం మృతి చెందాడు. రామన్నపేట మండల కేంద్రానికి చెందిన బండారు యాదగిరి(48) రూరల్ పోలీస్ స్టేషన్లో మంగళవారం విధులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి పోయాడు. గమనించిన తోటి సిబ్బంది చికిత్స నిమిత్తం స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
అంతర్ జిల్లా బందిపోటు అరెస్టు
ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలతోపాటు కర్ణాటక రాష్ట్రం లోని పలుచోట్ల బందిపోటు దొంగత నాలకు పాల్పడి, అనేక సైబర్ కేసుల్లో నిందితుడిగా వున్న మేకల దుర్గారావు అలియాస్ దుర్గాప్రసాద్ను మంగళవారం ఖమ్మం జిల్లా ఇల్లెందు పోలీసులు అరెస్టు చేశారు.