జిఎంఆర్ ఎఫెక్ట్: మాల్యాకు హైదరాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్
హైదరాబాద్: కింగ్ ఫిషర్ యజమాని విజయ్ మాల్యాకు హైదరాబాద్ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. విజయ్ మాల్యాను ఏప్రిల్ 13వ తేదీలోగా కోర్టులో హాజరుపరచాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.
అడిషనల్ చీఫ్ మెట్రోపాలియన్ మెజిస్ట్రేట్ జిఎస్ రమేష్ కుమార్ ఈ ఆదేశాలు జారీ చేశారు. జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్... విజయ్ మాల్యా పైన కోర్టుకు ఎక్కింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

వాళ్లు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని, పేమెంట్ డిఫాల్ట్ తదితరాల కింద జిఎంఆర్ కోర్టుకు వెళ్లింది. జిఎంఆర్ ఎయిర్ పోర్ట్ అధికారులు... విజయ్ మాల్యా ఎయిర్ లైన్స్ 11 కేసులు ఫైల్ చేశారు. ఇందులో రూ.50 లక్షల చెక్కు బౌన్సు కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.












Click it and Unblock the Notifications