హైదరాబాద్లో కార్ల రేసింగ్ రద్దు: టికెట్లకు ఫుల్ రిఫండ్ చేస్తామన్న ఐఆర్ఎల్
హైదరాబాద్: కార్ల ప్రమాదాలు, సాంకేతిక కారణాలతో హైదరాబాద్లో నిర్వహించాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్) అర్ధాంతరంగా రద్దయిన విషయం తెలిసిందే. నవంబర్ 19, 20 తేదీల్లో కార్ల రేసింగ్ చూసేందుకు టికెట్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి మొత్తం చెల్లింపు చేస్తామని ఐఆర్ఎల్ గురువారం ప్రకటించింది.
హైదరాబాద్లో నవంబర్ 19, 20వ తేదీల్లో కార్ల రేసింగ్ వీక్షించేందుకు టికెట్లు కొనుగోలు చేసినవారందరికీ రిఫండ్ చేస్తామని ఇండియన్ రేసింగ్ లీగ్ స్పష్టం చేసింది. ఈమెయిల్ లేదా టెక్ట్స్ మెసేజ్ ద్వారా దీని గురించి తెలియజేస్తామని ఐఆర్ఎల్ ట్వీట్ చేసింది.
ఈ నేపథ్యంలోనే టికెట్ల కొనుగోలు చేసినవారు రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. రేస్ రద్దు చేసిన రోజు కూడా ఇలాంటి ప్రకటనే చేశారని.. అయితే, తనకు ఇప్పటికీ ఎలాంటి రిఫండ్ చేయలేదని రూ. 6999తో టికెట్ కొనుగోలు చేసిన నగరవాసి ఒకరు పేర్కొన్నారు.
ప్రమాదాల కారణంగా మొదట రేసింగ్ ను వాయిదా వేసినట్లు ఐఆర్ఎల్ ప్రకటించింది. ఫెడరేషన్ ాఫ్ మొటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ప్రమాదాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది.
ట్రాక్పై ఓ చెట్టు కొమ్మ పడటంతో రేసింగ్ కారు కూడా దెబ్బతింది. అంతేగాక, పలు చోట్ల కార్లకు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు ఇరుకుగా ఉండటం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. పలువురు రేసర్లు కూడా ీ ప్రమాదాల్లో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రోడ్ల నాణ్యత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి రేసింగ్ నిర్వాహకులు కోరారు. అంతా బాగుంటే డిసెంబర్ 10, 11 తేదీల్లో అదే ట్రాక్ పై రేసింగ్ జరిగే అవకాశం ఉంది.