అందరినీ పలకరిస్తూ ఉత్సాహంగా ఇవాంకా: హోటల్లో ఇలా, ఇవాంకా కోసం సిటీలో రోడ్డెక్కారు!
గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్ షిప్ సమ్మిట్ కోసం హైదరాబాద్ వచ్చిన ఇవాంకా ట్రంప్ హోటల్లో అందరితో కలివిడిగా నడుచుకుంటున్నారు. ఆమె మంగళవారం ఉదయం మూడు గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు.
Recommended Video

హైదరాబాద్: గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్ షిప్ సమ్మిట్ కోసం హైదరాబాద్ వచ్చిన ఇవాంకా ట్రంప్ హోటల్లో అందరితో కలివిడిగా నడుచుకుంటున్నారు. ఆమె మంగళవారం ఉదయం మూడు గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి నేరుగా హోటల్కు వెళ్లారు.
మధ్యాహ్నం గం.2.50 నిమిషాల దాకా హోటల్లోనే బస చేయనున్నారు. ఈ సమయంలో ఆమె హోటల్లో సరదాగా, అందరితో కలివిడుగా ఉంటున్నారని తెలుస్తోంది. అధికారులను, సిబ్బందిని పరిచయం చేసుకుంటూ బిజీగా గడుపుతున్నారు.
ఉత్సాహంగా పలకరిస్తున్న ఇవాంకా ట్రంప్
తనను పలకరిస్తున్న వారితో ఇవాంకా ఉల్లాసంగా ఉత్సాహంగా మాటలు కలిపారు. నలుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న ఆమెకు ఉదయం అమెరికా రాయబారి కెనెట్, కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం హోటల్ వద్ద వారు ఇద్దరికి స్థానిక అధికారులను, హోటల్ మేనేజ్మెంట్ను పరిచయం చేశారు.
అల్పాహారం తీసుకొని
ఈ సమయంలో వారితో ఇవాంకా కలివిడిగా మాట్లాడారని తెలుస్తోంది. అనంతరం ఉదయం కాసేపు విశ్రాంతి తీసుకుని స్వల్పంగా అల్పాహారం స్వీకరించినట్టుగా తెలుస్తోంది. అప్పుడు కూడా తనకు కనిపించిన ప్రతి వారినీ అమె పలకరిస్తూనే ఉన్నారని అంటున్నారు.
ఇవాంకా కాన్వాయ్లో 17 అమెరికా వాహనాలు
అమెరికా నుంచి వచ్చిన ఇవాంక కాన్వాయ్ లో 17 యూఎస్ వాహనాలే ఉండటం గమనార్హం. ఆమె పర్యటన కోసం అమెరికా నుంచి సొంత బులెట్ ప్రూఫ్ వాహనాన్ని తెప్పించారు. హోటల్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు హైదరాబాద్లోని 150 భవనాల నుంచి అక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు పహారా కాస్తున్నాయి.
ఇవాంకా కోసం రోడ్డెక్కారు
ఇదిలా ఉండగా, ఇవాంకా ట్రంప్ రాక నేపథ్యంలో ఆమె ప్రయాణించే ప్రాంతంలో రోడ్లు బాగు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ప్రాంతంలో పలువురు ప్రజలు వినూత్న నిరసన చేపట్టారు. ఇవాంకా మా ప్రాంతానికి రా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ఇవాంకా, సికింద్రాబాద్ రా
తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి కొందరు స్థానికులు 'ఇవాంకా, దయచేసి సికింద్రాబాద్కి రా' అని ప్లకార్డులు ప్రదర్శించారు. ఇది సంగీత్ క్రాస్రోడ్స్ వద్ద కనిపించింది. కనీసం ఇవాంకా వస్తేనైనా తమ ప్రాంతం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఖండించిన అధికారులు
అయితే వీరి నిరసనలకు గల కారణాలను జీహెచ్ఎంసీ అధికారులు ఖండించారు. ఇవాంకా ట్రంప్ సందర్శించబోని ప్రాంతాలను కూడా బాగుచేసేందుకు ప్రభుత్వం చాలా డబ్బులు ఖర్చు పెట్టిందని చెబుతున్నారు.
చదవండి: గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్షిప్ సమ్మిట్ మరిన్ని కథనాలు
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications