హైదరాబాద్ కు అమృత్ భారత్ రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు..!!
త్వరలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తమిళనాడు, కేరళపై కేంద్ర ప్రభుత్వం వరాలను కురిపించింది. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాలకు మూడు చొప్పున అమృత్ భారత్, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కేటాయించింది. తమిళనాడుకు కేటాయించినవి ఏపీ మీదుగా పశ్చిమ బెంగాల్ వరకు రాకపోకలు సాగిప్తాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ కీలక నిర్ణయం దేశంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల మధ్య దూర రైలు అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని రైల్వే శాఖ తెలిపింది.
వీటికి అదనంగా ఈ రెండు రాష్ట్రాలకు ఒక్కో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు కూడా ఏపీ మీదుగా తెలంగాణకు కనెక్ట్ అయ్యేలా రూట్ ను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఇందులో ఒకటి- చర్లపల్లి నుండి నాగర్కోయిల్, రెండోది- తిరువనంతపురం నుండి హైదరాబాద్ మధ్య ఇవి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ఇప్పటివరకు హైదరాబాద్ కు అమృత్ భారత్ రైళ్లు లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

చర్లపల్లి నుండి నాగర్కోయిల్ ఎక్స్ ప్రెస్.. గుంటూరు, నెల్లూరు, చెన్నై, తిరుచిరాపల్లి, మదురై వంటి ప్రధాన స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది. రెండోది తిరువనంతపురం- హైదరాబాద్ మార్గంలో సేవలు అందిస్తుంది. విజయవాడ, ఒంగోలు, తిరుపతి, సేలం, కోయంబత్తూర్, త్రిశూర్ ఉన్నాయి. వీటితో పాటు తిరువనంతపురం-చెన్నై, తిరువనంతపురం-బెంగళూరు మధ్య కూడా మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి.
తిరువనంతపురం- హైదరాబాద్ మధ్య ప్రస్తుతం ఉన్న రైలు ప్రయాణం దాదాపుగా 22 గంటలు పడుతోంది. అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రవేశపెడితే ప్రయాణ సమయంలో మూడు నుంచి నాలుగు గంటలు తగ్గే అవకాశం ఉంది. తిరువనంతపురం నుంచి బయలుదేరే ఈ ఎక్స్ ప్రెస్ త్రిశూర్, పాలక్కాడ్, కోయంబత్తూర్, ఈరోడ్, సేలం, బెంగళూరు, అనంతపురం, కర్నూలు మీదుగా ఈ రైలు రాకపోకలు సాగించేలా రూట్ ఖరారైనట్లు సమాచారం.
తమిళనాడు- పశ్చిమబెంగాల్ మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు శనివారం నాడు పట్టాలెక్కనున్నాయి. తిరుచిరాపల్లి- న్యూ జల్ పాయ్ గురి, తాంబరం- సంత్రాగచ్చి, నాగర్కోయిల్- న్యూ జల్ పాయ్ గురిని కనెక్ట్ చేస్తాయి ఈ రైళ్లు ఇవన్నీ కూడా ఏపీ మీదుగా రాకపోకలు సాగించేవే. తిరునల్వేలి, కోవిల్పట్టి, సత్తూరు, విరుధునగర్, మధురై, దిండిగల్, పళని, ఉడుమాల్ పేట, పొల్లాచ్చి, కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్పేటై, కాట్పాడి, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, ఖరగ్పూర్ మీదుగా నడుస్తాయి.
-
"ఆర్ఆర్బీ" గుడ్ న్యూస్.. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్..! -
రోడ్డున పడుతున్న గిగ్ వర్కర్లు, ప్రత్యామ్నాయంగా..!! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..!












Click it and Unblock the Notifications