సాంకేతిక లోపం! ఆ మార్గంలో నిలిచిన మెట్రో రైళ్లు: ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్: సాంకేతిక కారణాల వల్ల మెట్రో రైలు కారిడార్-1లో ఎల్బీనగర్ నుంచి మూసాపేట వరకు మాత్రమే మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. అయితే, మియాపూర్ వరకూ రైళ్లు నడవాల్సి ఉండగా.. మూసాపేట - బాలానగర్ స్టేషన్ మధ్యలో మెట్రో ఓవర్ హెడ్ విద్యుత్ తీగలు తెగిపోవడంతో ఆ మార్గంలో అంతరాయం ఏర్పడింది.

తాత్కాలికంగా మూసివేత
మూసాపేటలో స్లిప్ట్ రివర్సల్ విధానంలో మెట్రో ట్రాక్ మార్చి అక్కడి నుంచి ఎల్బీనగర్ వరకూ మెట్రో రైళ్లను నడుపుతున్నారు. మియాపూర్, బాలానగర్, జేఎన్టీయూ, కేపీహెచ్బీ, కూకట్పల్లి.. ఈ ఐదు స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు.

తెగిపోయిన విద్యుత్ తీగలు
విద్యుత్ తీగలు తెగిపడటంతో యుద్ధప్రాతిపదికన మరమ్మతు చర్యలు చేపట్టినట్లు మెట్రో రైలు అధికారులు వెల్లడించారు. రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో ప్రయాణికులు మెట్రోస్టేషన్లలో పడిగాపులు కాస్తున్నారు.

ప్రయాణికుల ఆందోళన
పండగ సీజన్ కావడంతో మెట్రోస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బాలానగర్ స్టేషన్లో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గమ్యస్థానాలు, కార్యాలయాలకు సమయానికి చేరుకోలేకపోతున్నామని సిబ్బందితో కొందరు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు.

సమస్యలు సాధారణమే..
కాగా, ప్రస్తుతానికి మెట్రో విద్యుత్ తీగలను పునరుద్ధరించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైళ్లను ఒకే మార్గంలో కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి సమస్యలు తలెత్తడం సర్వసాధారణమని ఆయన తెలిపారు.
కాగా, శనివారం మధ్నాహ్నం తర్వాత సాంకేతిక లోపాన్ని సరి చేయడంతో తిరిగి మెట్రో రైళ్లు ముందుకు కదిలాయి.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications