హద్దు దాటితే చర్యలు తప్పవు: నార్త్జోన్ డీసీపీ హెచ్చరిక, నేరాలు తగ్గాయన్న ఆనంద్
హైదరాబాద్: నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ డిసెంబర్ 31న అర్ధరాత్రి వేడుకలు సంబరంగా చేసుకోవచ్చనీ.. అయితే, యువతీయువకులు హద్దులు దాటితే మాత్రం కఠినచర్యలు తప్పవని హైదరాబాద్ నార్త్జోన్ డీసీపీ ప్రకాశ్రెడ్డి హెచ్చరించారు.
జనవరి 1న ఉదయం ఒంటిగంట వరకే వేడుకలు జరుపుకోవాలని.. ఎవరైనా వెకిలి చేష్టలకు పాల్పడినా, మద్యం తాగి వాహనాలు నడిపినా, యువతులను వేధించినా, బైక్ రేసింగ్లకు పాల్పడినా కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అదేవిధంగా వేడుకల సమయంలో ఏ దుకాణదారుడైనా తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తే కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకలు నిర్వహించే హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు పోలీసుల నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో డీజేలను నిషేధించినట్లు తెలిపారు.

ఈ ఏడాది నేరాలు తగ్గాయి, షీ టీంలతో ఈవ్ టీజింగ్ తగ్గింది: సీవీ ఆనంద్
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాలు తగ్గిపోయాయని సైబారాబాద్ సీపీ సీవీ ఆనందర్ వెల్లడించారు. ఏడాదిలో జరిగిన నేరాలపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతేడాదిలో పోలిస్తే ఈ ఏడాది నేరాలు తగ్గాయన్నారు.
‘రాష్ట్రంలోనే అత్యధిక రికవరీలు సైబరాబాద్ పరిధిలోనే జరిగాయి. అతి తక్కువ మంది సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నాం. అన్ని రకాల సమస్యలు, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. చోరీ కేసుల్లో 79 శాతం రికవరీ చేశాం. ఫిర్యాదుల సంఖ్య కూడా చాలా వరకు తగ్గింది' అని చెప్పారు.
ఎల్బీనగర్ పరిధిలో ఈ ఏడాది 8,600కు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. కందుకూరు పరిధిలో తక్కువ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. షీటీమ్స్తో ఈవ్టీజింగ్ తగ్గింది. ఈ ఏడాది 3896 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. సైబరాబాద్ పరిధిలో 420 చైన్స్నాచింగ్ కేసులు నమోదు చేశాం' అని సీవీ ఆనంద్ తెలిపారు.
ట్రాఫిక్ పోలీసుల పని తీరు అద్భుతమని, అందరి సమన్వయంతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. మహిళలపై వేధింపులను అరిక్టేందుకు ఏర్పాటైన షీ టీంలతో ఈవ్ టీజింగ్ తగ్గిందన్నారు. ఎల్బీనగర్ ప్రాంతంలో ఆస్తి తగాదాలు అధికమయ్యాయని చెప్పారు. మహిళల భద్రతకు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications