‘సత్యభామ’లో హైదరాబాద్ విద్యార్థిని ఆత్మహత్య, ‘మిస్ యూ ఆల్’ అంటూ మెసేజ్
చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ లో మొదటి సంవత్సరం చదువుతున్న హైదరాబాద్కు చెందిన రాధ మౌనిక హాస్టల్ గదిలోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
హైదరాబాద్: చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో ఓ తెలుగు విద్యార్ధిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. హైదరాబాద్కు చెందిన రాధ మౌనిక ఈ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఇంజినీరింగ్ లో మొదటి సంవత్సరం చదువుతోంది.
రెండు రోజుల కిందట కళాశాలలో జరిగిన ఇంటర్నల్ ఎగ్జామ్ సందర్భంగా మౌనిక కాపీ కొట్టిందని.. దీంతో ఆమెను ఎగ్జామ్ హాల్ నుంచి అధ్యాపకులు బయటకు పంపించి వేశారని, తదుపరి పరీక్షలకు కూడా అనుమతించ లేదని తెలుస్తోంది.
దీంతో అందరిలో అవమానంగా భావించిన మౌనిక హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తన స్నేహితులకు మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్ అని మెసేజ్ పెట్టింది.

మౌనిక ఆత్మహత్యకు పాల్పడటంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పంచనామా నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు మౌనిక తల్లిదండ్రులకు సమాచారం అందించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్రు చేస్తున్నారు. ఓ తెలుగు విద్యార్ధిని ఆత్మహత్య ఘటన చెన్నైలో విద్యాబ్యాసం చేస్తున్న విద్యార్థుల్లో బయాందోళనలు కలిగిస్తోంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications