మోడీ! యశోదాకు న్యాయం చేయండి: 8రోజులుగా హైదరాబాద్ మహిళ దీక్ష
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ తన భార్య యశోదా బెన్(జశోదాబెన్)కు న్యాయం చేయాలంటూ నగరానికి చెందిన వైద్యురాలు పాలెపు సుశీల చేస్తున్న దీక్షను మియాపూర్ పోలీసులు భగ్నం చేశారు. యశోదాను మోడీ తన భార్యగా అంగీకరించి గౌరవించాలని, లేదంటే.. జెడ్ కేటగిరి భద్రత తొలగించి ఆమెకు స్వేచ్చ ప్రసాదించాలని డిమాండ్ చేస్తూ గత ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తోంది సుశీల.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాగా నీరసించినపోయిన ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే, తాను మాత్రం తన డిమాండ్లు పరిష్కారం అయ్యేదాకా దీక్ష విరమించబోనని సుశీల సోషల్ మీడియాలో స్పష్టం చేశారు.

అందుకే దీక్ష
అఖండ భారత ఉద్యమ వ్యవస్థాపకురాలిగా ఉన్న డాక్టర్ పాలెపు సుశీల.. హైదరాబాద్ మియాపూర్లోని న్యూ హఫీజ్ పేటలో క్లినిక్ నడుపుతున్నారు. హైందవ జీవన విధానంలో మహిళ పూజ్యనీయురాలని, స్త్రీల గౌరవాన్ని, స్వేచ్ఛను కాపాడటం కోసమే తాను దీక్షకు దిగినట్లు సుశీల తన ఫేస్బుక్ ఖాతాలో పేర్కొన్నారు. యశోదాబెన్ కు న్యాయం చేయాలంటూ దీక్ష చేశారు.

బ్రిటీష్ వాళ్లే నయమంటూ..
కాగా, దీక్ష భగ్నం అనంతరం ప్రధానిని ఉద్దేశించి డాక్టర్ సుశీల ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయం కోసం పోరాడుతుంటే తనను ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. అంతేగాక, ‘మానవత్వమేలేని మనుషులకు దేశం మనుషులు పట్టని నాయకులకు బ్రిటిష్ వాళ్ళే కరక్ట్' సోషల్ మీడియాలో అని వ్యాఖ్యానించారు.

సుశీలకు నెటిజన్ల హితవు
కాగా, ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచిఉన్నందునే యశోదా బెన్కు భద్రత కల్పిస్తున్నారని, ఈ విషయంలో దీక్షలు అవసరం లేదని నెటిజన్లు సుశీలకు హితవు పలుకుతున్నారు. కొందరైతే ప్రచారం కోసం ఇలాంటి పనులేంటని ప్రశ్నిస్తున్నారు.

బాల్యంలోనే పెళ్లి.. అప్పుడే..
ఇది ఇలావుంటే.. బాల్యంలోనే యశోదను పెళ్లాడిన నరేంద్ర మోడీ.. అనంతరం కొద్ది రోజులకే ఆమె నుంచి దూరంగా ఉండిపోయిన సంగతి తెలిసిందే. ఆమెను ఉన్నత చదువులు అభ్యసించాలని సూచించి ఆమెకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మోడీ రాజకీయాల వైపు, ఆమె ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అయ్యారు. గత కొంతకాలం క్రితం రిటైరైన ఆమె సొంత సోదరుల వద్దే ఉంటున్నారు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం!











Click it and Unblock the Notifications