ఉబెర్ ఇండియా సీపీఓగా హైదరాబాద్ మహిళ
అమెరికాకు చెందిన క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబెర్, తమ భారత్, దక్షిణాసియా శాఖలకు చీఫ్ పీపుల్స్ ఆఫీసర్గా హైదరాబాద్కు చెందిన విష్పాల రెడ్డిని నియమించింది.
హైదరాబాద్: అమెరికాకు చెందిన క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబెర్, తమ భారత్, దక్షిణాసియా శాఖలకు చీఫ్ పీపుల్స్ ఆఫీసర్గా హైదరాబాద్కు చెందిన విష్పాల రెడ్డిని నియమించింది. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విష్పాల రెడ్డికి ఈ రంగంలో 17 సంవత్సరాల అనుభవం ఉంది.
ఉబెర్ తనకు ఈ అవకాశం ఇవ్వడం పట్ల విష్పాల రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. గతంలో అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్గా, హెచ్ఆర్ విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించారు విష్పాల రెడ్డి.
అంతేగాక, హువిట్ అసోసియేట్స్లోనూ, కాగ్నిజెంట్లోనూ ఆమె పనిచేశారు. ఇటీవల ఉబెర్ సంస్థలో కార్యాలయ వేధింపులు బాగా జరుగుతున్నాయని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలావుంటే మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సహ వ్యవస్థాపకుడు ట్రావిస్ కలానిక్ గత కొంత కాలం క్రితమే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.