దమ్ముంటే నాపై పోటీ చెయ్: కడియంకు ఎర్రబెల్లి, తలసానికి ఎలా: మురళీధర్
వరంగల్: ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి దమ్ముంటే తన పైన పోటీ చేసి గెలవాలని తెలంగాణ టిడిపి శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు శుక్రవారం నాడు సవాల్ చేశారు. రైతులను జైల్లో పెట్టించిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీదిని అని దుమ్మెత్తి పోశారు.
వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు ప్రచార రంగంలోకి దిగారు. టిడిపి, బిజెపి నేతలు ఎన్డీయే అభ్యర్థి దేవయ్య తరఫున ప్రచారం చేస్తున్నారు. బిజెపి నేత మురళీధర రావు కూడా ప్రచార రంగంలోకి దిగారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ను మంత్రివర్గంలో కొనసాగించడం సిగ్గుచేటు మురళీధర రావు వరంగల్ ఎన్నికల ప్రచారంలో మండిపడ్డారు. ఇతర పార్టీలను బలహీనపర్చే కుట్ర టిఆర్ఎస్ చేస్తోందన్నారు. టిఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోందన్నారు.
చంద్రబాబు మోసం చేశారు: మందకృష్ణ మాదిగ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాది వేరుగా గమండిపడ్డారు. 2014 ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్న చంద్రబాబు, ఎన్నికల తర్వాత తన విధానాన్ని మార్చుకున్నారని ఆరోపించారు.
వర్గీకరణపై మాట్లాడటానికి కూడా చంద్రబాబు ప్రయత్నించడం లేదన్నారు. ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. మాదిగల ఉసురు చంద్రబాబుకు తప్పకుండా తగులుతుందని అన్నారు. ఆయన గుంటూరు జిల్లాలో విలేకరులతో మాట్లాడారు.