IRCTC బంపర్ ఆఫర్, కూర్గ్..మైసూర్ తో సహా - 5 రోజులు..ప్యాకేజీ..!!
సంక్రాంతి సెలవుల వేళ ఐఆర్సీటీసీ బంపరాఫర్ ఇస్తోంది. కర్నాటకలోని పలు ప్రదేశాలు చూసేందుకు అతి తక్కువ ధరకే టూర్ ను ఆపరేట్ చేస్తోంది. అయిదు రోజుల పాటు కర్ణాటకలో పలు ప్రముఖ సందర్శనీయ స్థలాలను దర్శించేలా ప్లాన్ చేసింది. ప్యాకేజీ వివరాలను ఖరారు చేసిన అధికారులు... పూర్తి షెడ్యూల్ ను వెల్లడించారు.
ఐఆర్సీసీటీ సెలవుల్లో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. కర్నాటకలోని కూర్గ్ ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్. మత్తెక్కించే కాఫీ తోటలు, అద్భుతమైన జలపాతాలు, చారిత్రక కట్టడాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. ఇక కర్నాటకలో మరో అద్భుతమైన ప్రదేశం మైసూర్. ఇక్కడి రాజభవనం, చందనంతో చేసిన కళాఖండాలు మదిని దోచేస్తాయి. అందుకే ఈ రెండు ప్రాంతాలను వీక్షించేందుకు ఐఆర్సీటీసీ ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. రైలు ప్రయాణం ద్వారా "కాఫీ విత్ కర్నాటక" పేరుతో ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ఈ టూర్లో భాగంగా మైసూర్, కూర్గ్లోని పలు ప్రాంతాలు విజిట్ చేయవచ్చు. ఫస్ట్ రోజు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 7 గంటలకు ట్రైన్ (కాచిగూడ-మైసూర్ ఎక్స్ప్రెస్ - 12785) బయలు దేరుతుంది. రెండో రోజు ఉదయం 10 గంటలకు మైసూరు చేరుకుంటారు. మైసూర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా కూర్గ్ వెళ్తారు.

ఇక, మధ్యాహ్నం అక్కడి హోటల్లో చెకిన్ తర్వాత ఫ్రెషప్ అయ్యి అబ్బె వాటర్ ఫాల్స్ విజిట్ చేసి ఓంకారేశ్వర ఆలయం దర్శించుకుని తిరిగి హోటల్ కు చేరుకుంటారు. ఆ రాత్రికి కూర్గ్లోనే బస ఉంటుంది. మూడో రోజు హోటల్లో బ్రేక్ఫాస్ట్ అనంతరం భాగమండల, తలకావేరి విజిట్ చేస్తారు. మధ్యాహ్నం రాజా సీట్ పార్క్ను సందర్శిస్తారు. ఆరోజు రాత్రి కూడా కూర్గ్లోనే స్టే చేస్తారు. నాలుగో రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి మైసూర్కు స్టార్ట్ అవుతారు. జర్నీ మధ్యలో కావేరి నిసర్గధామ, టిబెటెన్ మానెస్టరీ, బృందావనం గార్డెన్స్ విజిట్ చేస్తారు. రాత్రికి మైసూరు చేరుకుని హోటల్లో చెకిన్ అయ్యి స్టే చేస్తారు. ఇక, అయిదో రోజు టిఫెన్ తిన్న హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి చాముండి హిల్స్, మైసూర్ ప్యాలెస్ విజిట్ చేసి మధ్యాహ్నానికి రైల్వేస్టేషన్కు చేరుతారు. మధ్యహ్నం 3 గంటలకు రైలు మైసూర్ నుంచి కాచిగూడకు బయలుదేరుతుంది. కంఫర్ట్(3AC) సింగిల్ రూ.34,900, డబుల్ .19,980, ట్రిపుల్ రూ.15,380 గా ఖరారు చేసారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications