IRCTC బంపర్ ఆఫర్, కూర్గ్..మైసూర్ తో సహా - 5 రోజులు..ప్యాకేజీ..!!
సంక్రాంతి సెలవుల వేళ ఐఆర్సీటీసీ బంపరాఫర్ ఇస్తోంది. కర్నాటకలోని పలు ప్రదేశాలు చూసేందుకు అతి తక్కువ ధరకే టూర్ ను ఆపరేట్ చేస్తోంది. అయిదు రోజుల పాటు కర్ణాటకలో పలు ప్రముఖ సందర్శనీయ స్థలాలను దర్శించేలా ప్లాన్ చేసింది. ప్యాకేజీ వివరాలను ఖరారు చేసిన అధికారులు... పూర్తి షెడ్యూల్ ను వెల్లడించారు.
ఐఆర్సీసీటీ సెలవుల్లో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. కర్నాటకలోని కూర్గ్ ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్. మత్తెక్కించే కాఫీ తోటలు, అద్భుతమైన జలపాతాలు, చారిత్రక కట్టడాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. ఇక కర్నాటకలో మరో అద్భుతమైన ప్రదేశం మైసూర్. ఇక్కడి రాజభవనం, చందనంతో చేసిన కళాఖండాలు మదిని దోచేస్తాయి. అందుకే ఈ రెండు ప్రాంతాలను వీక్షించేందుకు ఐఆర్సీటీసీ ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. రైలు ప్రయాణం ద్వారా "కాఫీ విత్ కర్నాటక" పేరుతో ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ఈ టూర్లో భాగంగా మైసూర్, కూర్గ్లోని పలు ప్రాంతాలు విజిట్ చేయవచ్చు. ఫస్ట్ రోజు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 7 గంటలకు ట్రైన్ (కాచిగూడ-మైసూర్ ఎక్స్ప్రెస్ - 12785) బయలు దేరుతుంది. రెండో రోజు ఉదయం 10 గంటలకు మైసూరు చేరుకుంటారు. మైసూర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా కూర్గ్ వెళ్తారు.

ఇక, మధ్యాహ్నం అక్కడి హోటల్లో చెకిన్ తర్వాత ఫ్రెషప్ అయ్యి అబ్బె వాటర్ ఫాల్స్ విజిట్ చేసి ఓంకారేశ్వర ఆలయం దర్శించుకుని తిరిగి హోటల్ కు చేరుకుంటారు. ఆ రాత్రికి కూర్గ్లోనే బస ఉంటుంది. మూడో రోజు హోటల్లో బ్రేక్ఫాస్ట్ అనంతరం భాగమండల, తలకావేరి విజిట్ చేస్తారు. మధ్యాహ్నం రాజా సీట్ పార్క్ను సందర్శిస్తారు. ఆరోజు రాత్రి కూడా కూర్గ్లోనే స్టే చేస్తారు. నాలుగో రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి మైసూర్కు స్టార్ట్ అవుతారు. జర్నీ మధ్యలో కావేరి నిసర్గధామ, టిబెటెన్ మానెస్టరీ, బృందావనం గార్డెన్స్ విజిట్ చేస్తారు. రాత్రికి మైసూరు చేరుకుని హోటల్లో చెకిన్ అయ్యి స్టే చేస్తారు. ఇక, అయిదో రోజు టిఫెన్ తిన్న హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి చాముండి హిల్స్, మైసూర్ ప్యాలెస్ విజిట్ చేసి మధ్యాహ్నానికి రైల్వేస్టేషన్కు చేరుతారు. మధ్యహ్నం 3 గంటలకు రైలు మైసూర్ నుంచి కాచిగూడకు బయలుదేరుతుంది. కంఫర్ట్(3AC) సింగిల్ రూ.34,900, డబుల్ .19,980, ట్రిపుల్ రూ.15,380 గా ఖరారు చేసారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications