IRCTC బంపర్ ఆఫర్, కూర్గ్..మైసూర్ తో సహా - 5 రోజులు..ప్యాకేజీ..!!
సంక్రాంతి సెలవుల వేళ ఐఆర్సీటీసీ బంపరాఫర్ ఇస్తోంది. కర్నాటకలోని పలు ప్రదేశాలు చూసేందుకు అతి తక్కువ ధరకే టూర్ ను ఆపరేట్ చేస్తోంది. అయిదు రోజుల పాటు కర్ణాటకలో పలు ప్రముఖ సందర్శనీయ స్థలాలను దర్శించేలా ప్లాన్ చేసింది. ప్యాకేజీ వివరాలను ఖరారు చేసిన అధికారులు... పూర్తి షెడ్యూల్ ను వెల్లడించారు.
ఐఆర్సీసీటీ సెలవుల్లో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. కర్నాటకలోని కూర్గ్ ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్. మత్తెక్కించే కాఫీ తోటలు, అద్భుతమైన జలపాతాలు, చారిత్రక కట్టడాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. ఇక కర్నాటకలో మరో అద్భుతమైన ప్రదేశం మైసూర్. ఇక్కడి రాజభవనం, చందనంతో చేసిన కళాఖండాలు మదిని దోచేస్తాయి. అందుకే ఈ రెండు ప్రాంతాలను వీక్షించేందుకు ఐఆర్సీటీసీ ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. రైలు ప్రయాణం ద్వారా "కాఫీ విత్ కర్నాటక" పేరుతో ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ఈ టూర్లో భాగంగా మైసూర్, కూర్గ్లోని పలు ప్రాంతాలు విజిట్ చేయవచ్చు. ఫస్ట్ రోజు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 7 గంటలకు ట్రైన్ (కాచిగూడ-మైసూర్ ఎక్స్ప్రెస్ - 12785) బయలు దేరుతుంది. రెండో రోజు ఉదయం 10 గంటలకు మైసూరు చేరుకుంటారు. మైసూర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా కూర్గ్ వెళ్తారు.

ఇక, మధ్యాహ్నం అక్కడి హోటల్లో చెకిన్ తర్వాత ఫ్రెషప్ అయ్యి అబ్బె వాటర్ ఫాల్స్ విజిట్ చేసి ఓంకారేశ్వర ఆలయం దర్శించుకుని తిరిగి హోటల్ కు చేరుకుంటారు. ఆ రాత్రికి కూర్గ్లోనే బస ఉంటుంది. మూడో రోజు హోటల్లో బ్రేక్ఫాస్ట్ అనంతరం భాగమండల, తలకావేరి విజిట్ చేస్తారు. మధ్యాహ్నం రాజా సీట్ పార్క్ను సందర్శిస్తారు. ఆరోజు రాత్రి కూడా కూర్గ్లోనే స్టే చేస్తారు. నాలుగో రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి మైసూర్కు స్టార్ట్ అవుతారు. జర్నీ మధ్యలో కావేరి నిసర్గధామ, టిబెటెన్ మానెస్టరీ, బృందావనం గార్డెన్స్ విజిట్ చేస్తారు. రాత్రికి మైసూరు చేరుకుని హోటల్లో చెకిన్ అయ్యి స్టే చేస్తారు. ఇక, అయిదో రోజు టిఫెన్ తిన్న హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి చాముండి హిల్స్, మైసూర్ ప్యాలెస్ విజిట్ చేసి మధ్యాహ్నానికి రైల్వేస్టేషన్కు చేరుతారు. మధ్యహ్నం 3 గంటలకు రైలు మైసూర్ నుంచి కాచిగూడకు బయలుదేరుతుంది. కంఫర్ట్(3AC) సింగిల్ రూ.34,900, డబుల్ .19,980, ట్రిపుల్ రూ.15,380 గా ఖరారు చేసారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications