హైదరాబాద్ లో ఐసిస్ : ఆ కాలేజీపై అనుమానాలు!? లెక్చరర్ ఆత్మహత్య!
హైదరాబాద్ : ప్రపంచదేశాలను ఉగ్రవాదంతో గడగడలాడిస్తోన్న ఐసిస్ హైదరాబాద్ లోను పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నగరంలోని మలక్ పేట పరిధిలో ఉన్న ఎంఎస్ మైనారిటీ కళాశాల లెక్చరర్ ప్రవీణ్ కుమార్ ఆత్మహత్య నేపథ్యంలో.. విచారణ చేపట్టిన పోలీసులకు నివ్వెరపోయే విషయాలు తెలిసినట్టు సమాచారం.
కాగా, మలక్ పేటలోని ఎంఎస్ మైనారిటీ కళాశాలలో కొన్నాళ్లుగా లెక్చరర్ గా పనిచేస్తోన్న ప్రవీణ్ కుమార్ ఈమధ్యే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆత్మహత్యకు ముందు అతను రాసిన ఓ లేఖ పోలీసులకు దొరికింది. మలక్ పేటలోని ఎంఎస్ మైనారిటీ కళాశాలలో ఐసిస్ ఉగ్రవాదులు పలువురు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారని లేఖలో ప్రవీణ్ కుమార్ పేర్కొన్న విషయాన్ని పోలీసులు గుర్తించినట్టుగా వార్తలు వస్తున్నాయి.

చనిపోయే ముందు సేవ్ కంట్రీ అంటూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి చనిపోయాడు ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం దీనిపై మరింత లోతుగా విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమైనట్టు తెలుస్తోంది.
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications