వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

KTR Sircilla Tour: విజ్ఞానానికి మించిన సంపద లేదు.. సిరిసిల్లలో విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేసిన కేటీఆర్..

|
Google Oneindia TeluguNews

ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తన నియోజకవర్గంలో పర్యటించారు. సిరిసిల్లలో గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ ట్యాబ్‌లను అందజేశారు. విజ్ఞానానికి మించిన సంపద మరొకటి లేదని చెప్పారు. విద్యా ప్రమాణాలు పెంచేలా కృషిచేస్తామని పేర్కొన్నారు. 'మన ఊరు-మన బడి' కింద స్కూళ్లలో మరమ్మతులు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇంజినీరింగ్‌ కాలేజీని ఏర్పాటు చేశామన్నారు.

అంబులెన్సులు
గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద సిరిసిల్లకు ఆరు అంబులెన్సులు ఇచ్చామని, రాష్ట్ర వ్యాప్తంగా 120 అంబులెన్సులు సమకూరాయని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల జిల్లాకు మెడికల్‌ కాలేజీ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ప్రతి జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆరు వేల మంది ఇంటర్‌ విద్యార్థులకు ట్యాబ్‌లెట్స్‌ పంపిణీ చేస్తున్నాని చెప్పారు.

 IT and Municipal Minister KTR Sirisilla distributed the tabs to the students

చీరల పంపిణీ
కొత్త ఆలోచనలతో పైకి ఎదగాలనే తపన ఉన్న విద్యార్థులకు కచ్చితంగా అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. విద్యార్థులకు ట్యాబ్స్ అందజేసిన అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలను కేటీఆర్ పంపిణీ చేశారు. బతుకమ్మ చీరలతో సిరిసిల్ల చేనేతలకు లబ్ధి జరుగుతుందని చెప్పారు.

English summary
IT and Municipal Minister KTR visited Sirisilla. Tabs were distributed to the students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X