హెటిరో లో 550 కోట్ల బ్లాక్ మనీ గుర్తింపు : ఒక్కో అల్మారాలో రూ. 5 కోట్ల నగదు : ఐటీ అధికారుల సీజ్..!!
వారం రోజులుగా హాట్ టాపిక్ గా మారిన ప్రముఖ ఫార్మసీ సంస్థ హెటిరోలో ఐటీ అధికారులు సోదాలు ముగిసాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏక కాలంలో సంస్థకు చెందిన కార్యాలయాలు.. సీఈఓ తో పాటుగా డైరెక్టర్లకు చెందిన నివాసాల్లో సోదాలు చేసారు. దాదాపు నాలుగు రోజులకు పైగా ఈ సోదాలు కొనసాగాయి. సంస్థ ఉత్పత్తి ప్లాంట్లలోనూ సోదాలు నిర్వహించారు. ఐటీ శాఖ సోదాల గురించి ఆదాయపు పన్ను శాఖ లో పని చేసే అధికారులకే చాలా మందికి సమాచారం తెలియదు. బెంగుళూరు..చెన్నై నుంచి వచ్చిన అధికారులు హైదరాబాద్ లో ఉన్న అధికారులు..సిబ్బందితో కలిసి సోదాల్లో పాల్గొన్నారు.
సనత్ నగర్ లోని కార్పోరేట్ కార్యాలయంతో పాటుగా మల్కాజ్ గిరి పరిధిలో ఉన్న సంస్థ ప్లాంట్లలోనూ సోదాలు చేసారు. అయితే, ఈ సోదాల్లో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చినట్లుగా సమాచారం. హెటిరో సంస్థలో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది. రూ. 550 కోట్ల బ్లాక్ మనీని గుర్తించారు. రూ. 142 కోట్ల నగదు సీజ్ చేశారు. 6 రాష్ట్రాల్లో హెటిరో సంస్ధల్లో 60 చోట్ల 4 రోజులపాటు ఐటీ దాడులు జరిగాయి. వందల కొద్దీ అట్టపెట్టెల్లో నగదును దాచిపెట్టడాన్ని గుర్తించారు. బీరువాల నిండా రూ. 500 నోట్ల కట్టలే ఉన్నాయి.

నిండా నోట్ల కట్టలున్న ఇనుప బీరువాలను అధికారులు సీజ్ చేశారు. చిన్న చిన్న అపార్ట్మెంట్లలో ప్లాట్లను కొని డబ్బు దాచినట్టు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా మెడిసిన్ నిల్వ పేరుతో అట్టపెట్టెల్లో రూ. 142 కోట్లు దాచారని అధికారులు వెల్లడించారు. ఇనుప అల్మారాల్లో డబ్బును కుక్కిపెట్టారని తెలిపారు. ఒక్కో అల్మారాలో రూ. 5 కోట్ల నగదు దాచారని తెలిపారు. డబ్బు లెక్క పెట్టేందుకే రెండు రోజుల సమయం పట్టిందని అధికారులే వెల్లడిస్తున్నారు. పెద్ద సంఖ్యలో లాకర్లు గుర్తించిన ఐటీ అధికారులు మూడ్రోజులుగా లాకర్స్ను తెరిచి పరిశీలిస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ సమయంలో కీలకంగా మారిన రెమిడెసివిర్ ఇంజక్షన్ ఈ సంస్థ నుంచే ఉత్పత్తి అయింది. అదే విధంగా బెడ్ మీద తీవ్ర అస్వస్థతకు గురైన కరోనా బాధితులకు ఇచ్చే ఒక ప్రముఖ టాబ్లెట్ సైతం ఇక్కడి నుంచే మార్కెట్ లోకి వచ్చింది. దీంతో..ఆ సమయం నుంచే ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ తో పాటుగా ఆరు రాష్ట్రాల్లోని సంస్థకు చెందిన కార్యాలయాలు..కీలక ఉద్యోగుల నివాసాల్లో చేసిన సోదాల్లో కీలకమైన డాక్యమెంట్స్ సైతం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేసిన సొమ్ము పైన ఇప్పుడు హెటిరో సంస్థ వివరణ ఇవ్వాల్సి ఉంది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications