అలాగే అనిపిస్తోంది: వరంగల్ ఎన్కౌంటర్పై కోదండరామ్ సంచలనం
హైదరాబాద్: వరంగల్ జిల్లా ఎదురుకాల్పుల ఘటనపై తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ సంచలన ప్రకటన చేశారు. వరంగల్ ఎన్కౌంటర్ తప్పు అని, అలాంటి సంఘటనలు జరగకూడదని అంటూ తీసుకొచ్చి కాల్చేసినట్లే కనిపిస్తోందని ఆయన అన్నారు. వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో విద్యాసాగర్ రెడ్డి, శ్రుతి అలియాస్ మహిత అనే ఇద్దరు మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే.
తనకు అధికార దాహం లేదని, తాను ఎల్లవేళలా ప్రజల పక్షమేనని కోదండరామ్ శనివారంనాడు అన్నారు. ప్రతిపక్షాలపై తమకు ఏ విధమైన కోపం లేదని, అయితే వారితో కలిసి పనిచేయలేమని, తమ పంథా వేరని ఆయన చెప్పారు.

తనకు అనుమానం అక్కర్లేదని, ప్రజా సమస్యలపై పోరాడుతానని ఆయన చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్తాన్నది ఊహాగానాలు మాత్రమేనని కోదండరామ్ అన్నారు. ఆత్మహత్యలకు చేసుకున్న రైతుల కుటుంబాలకు జూన్ 2వ తేదీ నుంచి నష్టపరిహారం ఇవ్వాలని ఆయన అన్నారు. ఎపి అసెంబ్లీలో మాదిరిగా తెలంగాణ అసెంబ్లీలో అరుచుకోవడం మాని ప్రజా సమస్యలపై చర్చించాలని ఆన అన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications