కేసీఆర్ రమ్మనగానే పరుగెత్తాలా, జానారెడ్డిది తప్పు!: పొన్నాల సవాల్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బేగంపేట విమానాశ్రయానికి రమ్మని పిలవగానే, తాము నలబై నిమిషాల్లో పరుగెత్తాలా అని టిపిసిసి మాజీ చీఫ్, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అన్నారు.
మహారాష్ట్రతో ప్రాజెక్టుల ఒప్పందం పైన తాను సవాల్ చేస్తున్నానని, అసెంబ్లీ ఎదుట అమరవీరుల స్థూపం ముందు చర్చకు సిద్ధమన్నారు. కేసీఆర్ మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్న మరుసటి రోజు బేగంపేట విమానాశ్రయానికి వచ్చి తమను రమ్మని చెప్పగానే అరగంటలో పరుగెత్తుతామా అని ప్రశ్నించారు.

తెరాస ప్రభుత్వాన్ని పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి ఒకటి రెండు సందర్భాల్లో సమర్థించడాన్ని పొన్నాల తప్పు బట్టారు. ఆయన తీరు పార్టీకి ఇబ్బందికర పరిణామమేనని అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల నాటికి పార్టీ చీఫ్గా ఎవరున్నా తాము కలిసి సాగుతామన్నారు. అధికారం తమదే అన్నారు.












Click it and Unblock the Notifications