కలెక్టర్ వేధిస్తున్నారు.. ఒక్క గజం కూడా రిజిస్టర్ చేయించుకోలేదు: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
అసలు చెరువు శిఖం భూమి, అసైన్డ్ భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేయించేందుకు కంప్యూటర్ వెబ్ సైట్ అనుమతించదన్నారు.
జనగాం: జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వివాదం ముదురుతోంది. బతుకుమ్మ కుంట భూముల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని స్థానిక కలెక్టర్ దేవసేన ఆరోపిస్తోంది.
ఎమ్మెల్యే అక్రమాలకు సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలున్నాయని ఆమె చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే మాత్రం ఆరోపణలను ఖండిస్తున్నారు. బతుకమ్మ కుంటలో ఒక్క గజం కూడా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని ఆయన అంటున్నారు.

అసలు చెరువు శిఖం భూమి, అసైన్డ్ భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేయించేందుకు కంప్యూటర్ వెబ్ సైట్ అనుమతించదన్నారు. ఏ తప్పు చేయకున్నా జనగామ కలెక్టర్ శ్రీ దేవసేన తనను ఏడాదిగా వేధించారని అసెంబ్లీ లాబీలో మీడియా ఎదుట వాపోయారు. జనగామలోని బతుకమ్మ కుంట వివాదంపై కలెక్టరుకు మూడు నోటీసులు పంపానని, ఒకటి స్పీకర్, మరొకటి సీఎస్, మూడోది ప్రివిలేజ్ కమిటీ నుంచి వెళ్లాయని అన్నారు.
తన నోటీసులకు కలెక్టర్ సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. సమాధానం చెప్పలేక కలెక్టర్ రాజీ ప్రయత్నాలు చేస్తోందని ముత్తిరెడ్డి ఆరోపించారు. సరైన ఆధారాలు చూపించకపోతే ప్రివిలేజ్ కమిటీ ముందుకు రావాల్సిందేనని స్పష్టం చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications