హైదరాబాద్లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన హైదరాబాద్లోని ఓ వాణిజ్య భవనం పన్ను బకాయిల కారణంగా మంగళవారం వార్తల్లో నిలిచింది. ఆస్తి పన్ను సకాలంలో చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందన లేకపోవడంతో అధికారులు ఆ భవనాన్ని ఒక రోజు పాటు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అయితే ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే స్పందించిన సంబంధిత వ్యక్తులు పన్ను చెల్లింపు ప్రక్రియను ప్రారంభించడంతో బుధవారం నాటికి ఆ ఆస్తిని అధికారులు తిరిగి విడుదల చేశారు.
విజయ్ మాల్యాకు, ఈ భవనానికి ఉన్న సంబంధం ఏంటి?
హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ భవనానికి ఓ ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. గతంలో పరారీలో ఉన్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యా ఈ భవనాన్ని లీజుకు తీసుకున్నారు. విజయ్ మాల్యా దేశం విడిచి వెళ్లకముందు దీనిని తన వ్యాపార అవసరాలకు వాడుకోవడంతో జీహెచ్ఎంసీ రికార్డు ఈ బిల్డింగ్ వాణిజ్య విభాగంలో నమోదైంది. విజయ్ మాల్యా వెళ్లిపోయిన తర్వాత కూడా ఈ కేటగిరీని మార్చడానికి కానీ లేదా నివాస ప్రాంతంగా మార్చడానికి కానీ ఎవరూ ప్రయత్నించలేదు. దీనివల్ల వాణిజ్య రేట్ల ప్రకారం భారీగా పన్ను బకాయిలు పేరుకుపోయాయి.

అదే అసలు సమస్య
జయలలిత మరణానంతరం ఈ ఆస్తిపై యాజమాన్య బదిలీ ప్రక్రియ జరగకపోవడం ప్రధాన సమస్యగా మారింది. జీహెచ్ఎంసీ రికార్డుల ప్రకారం ఈ భవనం ఇంకా జయలలిత పేరు మీదనే కొనసాగుతోంది. జయలలిత ఎటువంటి వీలునామా రాయకుండా మరణించడంతో 2020 మే నెలలో మద్రాస్ హైకోర్టు జయలలిత మేనల్లుడు జె. దీపక్, మేనకోడలు జె. దీపలను ఆమె చట్టబద్ధమైన వారసులుగా ప్రకటించింది. అయినప్పటికీ అధికారికంగా వారసుల పేరు మీదకు ఆస్తి బదిలీ కాకపోవడం, పన్ను చెల్లింపులపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో బకాయిలు పెరిగిపోయి, చివరకు అధికారులు సీజ్ చేసే వరకు పరిస్థితి వెళ్ళింది.
వారసుల స్పందన.. భవిష్యత్తు చర్యలు
భవనం సీజ్ సమాచారం అందుకున్న వారసులు వెంటనే పన్ను బకాయిలను క్లియర్ చేసే ప్రక్రియను ప్రారంభించారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు మానవీయ కోణంలో ఆలోచించి, సీల్ను తొలగించి భవనాన్ని తిరిగి అప్పగించారు. అయితే ఈ సమస్య మళ్లీ తలెత్తకుండా ఉండాలంటే, వారసుల పేర్లను మున్సిపల్ రికార్డుల్లో నమోదు చేయడం, ప్రస్తుత భవన వినియోగానికి అనుగుణంగా కేటగిరీని మార్చుకోవడం వంటి పనులపై వారు తక్షణమే దృష్టి సారించాల్సి ఉంది.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications