6 నుంచి జనసేన సమన్వయకర్తల ఎంపిక, పవన్ ఫ్యాన్స్ మళ్లీ తిడుతున్నారు: మహేశ్ కత్తి
ఈ నెల 6వ తేదీ నుంచి పార్టీ సమన్వయకర్తల ఎంపికను చేపట్టనున్నట్లు జనసేన తెలిపింది. ఎంపికైన సమన్వయకర్తలతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు.
హైదరాబాద్: ఈ నెల 6వ తేదీ నుంచి పార్టీ సమన్వయకర్తల ఎంపికను చేపట్టనున్నట్లు జనసేన తెలిపింది. ఎంపికైన సమన్వయకర్తలతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు.
పార్టీ సమన్వయకర్తల నియామకానికి జనసేన ఇప్పటికే సన్నాహం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటరీ స్థానాల వారీగా ఈ సమన్వయకర్తల నియామకాన్ని చేపట్టనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని 42 పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తల నియామకం చేస్తున్నట్లు జనసేన ప్రకటన చేసింది. మొత్తం 840 మంది పార్టీ సమన్వయకర్తల నియామకానికి పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.
ఎల్లుండి నుంచి జనసేన సమన్వయకర్తల ఎంపిక ప్రక్రియను ప్రారంభించనున్నారు. వచ్చేనెల 7 నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మళ్లీ వేధిస్తున్నారు: మహేష్ కత్తి
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు తనను వేధిస్తున్నారంటూ సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తి ఆ మధ్య మీడియా ముందుకు వచ్చి తన బాధను చెప్పుకున్న విషయం తెలిసిందే.
అయితే ఆయనకు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి వేధింపులు ఇంకా తగ్గలేదు. పవన్ కల్యాణ్ అభిమానులంటే ఎలాగుంటారో చెబుతూ.. వాట్సప్లో తనను బూతులు తిడుతూ మెజేస్లు పెడుతున్నారంటూ మహేశ్ కత్తి తన ఫేస్బుక్ ఖాతాలో పేర్కొంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
పవన్ ఫ్యాన్స్ తనను తిడుతున్నారడానికి ఇదే సాక్ష్యం అంటూ వాట్సప్ స్క్రీన్ షాట్ని కూడా ఆయన పోస్ట్ చేశాడు. అందులో పరుష పదజాలంతో మహేశ్ కత్తిని పవన్ ఫ్యాన్స్ తిట్టినట్లు కనిపిస్తోంది. అలాగే ఓ మొబైల్ నెంబరు నుంచి తనకు కాల్ వచ్చిందని, తనను ఓ అభిమాని బెదిరించాడని మహేశ్ కత్తి పేర్కొంటూ ఆ ఫోన్ నెంబరు కూడా పోస్ట్ చేశాడు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications