ఆ ఏఎస్సై తెలుగు సినిమా నిర్మాతలకు వడ్డీకి డబ్బులిచ్చాడు!
అదిలాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కరీంనగర్ జిల్లా ఏఎస్సై మోహన్ రెడ్డి, మరికొందరు కలిసి పలువురు తెలుగు సినిమా నిర్మాతలకు ఫైనాన్స్ ఇచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆరోపణలు ఎదుర్కొంటున్న మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ వద్ద కళ్లు చెదిరే ఆస్తులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఓ ఫంక్ష్ హాల్, పెట్రోల్ బంక్, జాతీయ రహదారి 44 దగ్గర ఇటీవలే 7 ఎకరాల భూమి కొనుగులు చేసినట్లు గుర్తించారని తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీకి ఫైనాన్స్ చేశారు.

సమాచారం మేరకు... మోహన్ రెడ్డితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సినిమా నిర్మాతలకు ఫైనాన్స్ చేసినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆ సినిమా విడుదలైనట్లుగా చెబుతున్నారు.
కాగా, ఏఎస్సైగా విధులు నిర్వర్తించే మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారంతో ఎందరి జీవితాల్లోనో చిచ్చు పెట్టినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అతడిని విచారించే కొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. ఇతడితోపాటు చేతులు కలిపి అతడి వడ్డీ వ్యాపారంలో పాలుపంచుకున్న మరికొందరి పోలీసు అధికారుల పేర్లు కూడా బయటకు వస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications