కవిత ఈడీ విచారణ వేళ.. హస్తినలో కవితకు మద్దతుగా పోస్టర్లు, ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు!!
కవిత ఈడీ విచారణ వేళ హస్తినలో కవితకు మద్దతుగా పోస్టర్లు వెలిశాయి. ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ నివాసం వద్దకు చేరుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత నేడు ఈడి విచారణను ఎదుర్కోబోతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరుణ్ రామచంద్ర పిళ్ళై ఇచ్చిన వాంగ్మూలంలో కవిత పేరు పేర్కొన్న నేపథ్యంలో మరోమారు కవితకు నోటీసులు ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు కవితను విచారించడానికి సిద్ధమయ్యారు. దీంతో ఈరోజు కవిత విచారణలో ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. మరోవైపు కవితకు మద్దతుగా కేటీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈడి విచారణను ధైర్యంగా ఎదుర్కొంటానని ఎమ్మెల్సీ కవిత కూడా స్పష్టం చేశారు.
Delhi | BRS workers and supporters gather outside the residence of Telangana CM and party chief K Chandrashekar Rao.
— ANI (@ANI) March 11, 2023
The CM's daughter and party MLC K Kavitha is scheduled to appear before ED today in connection with the Delhi liquor policy case. pic.twitter.com/dJ8XhIBUrD
ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ప్రశ్నించాలని భావిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా కన్ఫ్రంటేషన్ ఇంటరాగేషన్ చేసే ఆలోచనలో ఉందని సమాచారం. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా, కవిత, అరుణ్ రామచంద్ర పెళ్లై లను మరో మారు విచారించనున్న ఈడీ ప్రధానంగా అరుణ్ పిళ్ళై తో కవిత ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం లో సేకరించిన ఆధారాలను, దర్యాప్తులో తేలిన అనేక వివరాలను ఆధారంగా చేసుకుని కవితను ప్రధానంగా మనీ లాండరింగ్ వ్యవహారంలో విచారించడానికి ఈడి సిద్ధమైంది.

ఇదిలా ఉంటే ఈరోజు ఎమ్మెల్సీ కవిత ఎన్ఫోర్స్మెంట్ విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కవితకు మద్దతుగా దేశ రాజధాని ఢిల్లీలో హోర్డింగులు, ఫ్లెక్సీలు వెలిశాయి. పోరాట యోధుడి బిడ్డ కవిత, ఎప్పుడూ భయపడదు అంటూ పోస్టర్లు వేశారు అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు. బై బై మోడీ అంటూ మోడీ సర్కార్ ను టార్గెట్ చేశారు. దాడులతో కొందరు రాజకీయ నాయకులు మారిపోతారని, బీజేపీ అలా చాలా మందిని మార్చిందని, కానీ కొందరు మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటారని, కేసీఆర్ బిడ్డ కవిత దేనికీ భయపడదని ఫోటోలతో హంగామా చేస్తున్నారు. కవితకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రచ్చ చేస్తున్నారు. అంతేకాదు దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు భారీగా సీఎం కేసీఆర్ నివాసం వద్దకు చేరుకున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications