Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎంజీఎంలో దూది ఉంటే సూది లేదు, వరద సాయం ఇదేనా: నిలదీసిన కవిత

వరద ముంపుకు గురైన ప్రాంతాలలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి సహాయం చేయలేదని, వరంగల్లో 150 ఇళ్లు కొట్టుకుపోతే నయా పైసా సాయం అందలేదని తెలంగాణ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందని కవిత పేర్కొన్నారు. ఇక వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో పరిస్థితి సూది ఉంటే దూది లేదని, బేసిక్ మందులు కూడా లేవని, పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు చెప్పారు.

kavitha visit flood affected areas and warangal mgm hospital slams revanth govt over problems

Take a Poll

కవిత జనం బాట పాదయాత్ర
వరంగల్, హన్మకొండ జిల్లాలలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనం బాట పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో భాగంగా కవిత వరంగల్ లోని సమ్మయ్య నగర్ సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో వరదలో మునిగిన ఇళ్లను పరిశీలించారు. 15 రోజుల క్రితం సీఎం ఇక్కడికి వచ్చి ప్రజలకు చాలా హామీలు ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు.

kavitha visit flood affected areas and warangal mgm hospital slams revanth govt over problems

ప్రకృతి విపత్తు కాదు, కాంగ్రెస్ తెచ్చిన విపత్తు
సీఎం మాట అంటే అది జీవోతో సమానమని ఆయనే అన్నాడు. మరి సీఎం మాట ఎందుకు అమలు కాలేదని కలెక్టర్ గారిని ప్రశ్నిస్తున్నానన్నారు. ఇది పకృతి విపత్తు కాదు, కాంగ్రెస్ తెచ్చిన విపత్తు అన్నారు. వరంగల్, హన్మకొండలో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన కవిత ఎంజీఎం హాస్పిటల్ లో వసతులు, సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం అన్నారు.

kavitha visit flood affected areas and warangal mgm hospital slams revanth govt over problems

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సూది ఉంటే దూది లేదు
తెలంగాణ వచ్చాక ఈ హాస్పిటల్ సరిపోదని కొత్తది కట్టుకోవాలనుకున్నాం. వరంగల్ జైలు స్థలాన్ని తీసుకొని 20ఫ్లోర్లతో నిర్మించతలపెట్టిన హాస్పిటల్ ఆగిపోయిందన్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సూది ఉంటే దూది లేదు. దూది ఉంటే సూది లేదన్నట్లుగా ఉంది పరిస్థితి అన్నారు. ఉచితంగా అందించే బేసిక్ మందులు కూడా లేవన్నారు. వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు, ముగ్గురు మంత్రులున్న ఫలితం లేదని, ఎంజీఎంలో టెస్టులు చేసేందుకు కావాల్సిన కెమికల్స్ కూడా లేవన్నారు.

kavitha visit flood affected areas and warangal mgm hospital slams revanth govt over problems

రాజకీయాలు అప్పుడు చేసుకుందాం
ఇలా ఎవరు చేసినా తప్పేనని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరిదైనా అది తప్పే అన్నారు. ఎన్నికలు ఉన్న చివరి ఏడాది రాజకీయాలు చేసుకుందామని అప్పటివరకు పేద ప్రజల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో బీజేపీ మూడు సార్లు గెలిచింది. కాంగ్రెస్ గెలిచి రెండేళ్లు అయ్యింది. బీఆర్ఎస్ హయాంలో సమస్యలు తీరాక ఇప్పుడు తీరకపోతే ఏంటీ పరిస్థితి? అని ప్రశ్నించారు. తాను ఇప్పుడు ఓట్ల కోసం రాలేదని, ప్రజల సమస్యలను తెలుసుకోవాలని వచ్చానని అన్నారు.

పరిష్కారమైన సమస్యలపై యాక్షన్ టేకెేన్ రిపోర్ట్ విడుదల చేస్తాం
జనం బాట కు సంబంధించి 5 జిల్లాలకు కలిపి యాక్షన్ టేకెేన్ రిపోర్ట్ విడుదల చేస్తాం అన్నారు. 5 జిల్లాల్లో మా దృష్టికి వచ్చిన సమస్యలు వాటిలో పరిష్కారమైనవి 5 జిల్లాల వారీగా రిపోర్ట్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. తాను పిల్లల్ని వదిలేసి టైంపాస్ కోసం పర్యటన చేయడం లేదన్నారు. తన పర్యటనలతో ప్రజల సమస్యలు పరిష్కారమైతే ప్రజలకు పైసా మేలు జరిగితే తన జన్మ ధన్యమైనట్టేనని కవిత పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+