ఉలిక్కిపడ్డ గులాబీబాస్ కేసీఆర్; ఆ సీన్ రిపీట్ అవుతుందా?
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష వైఖరిని వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో సమావేశం నిర్వహించడం బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర చర్చకు కారణమైంది. ఇక ఈ సీన్ అనేక జిల్లాలలో రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.

మేడ్చల్ సీన్ అన్ని జిల్లాల్లో రిపీట్ అవుతుందా?
మంత్రి మల్లారెడ్డి నామినేటెడ్ పదవుల భర్తీలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మేడ్చల్ జిల్లా కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని పదవులను తన నియోజకవర్గ నాయకులకు కట్టబెడుతున్నారని, పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం ఇవ్వడం లేదని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ వ్యవహారాన్ని కేసీఆ,ర్ కేటీఆర్ వద్దని తేల్చుకుంటాం అంటూ వారు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల మాటలను బేఖాతరు చేస్తూ మంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న నాయకులకు తాము మంత్రి కారణంగా న్యాయం చేయలేక పోతున్నామని వారు వాపోయారు. బీఆర్ఎస్ పార్టీలో తాజాగా చోటు చేసుకున్న ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లోనూ రిపీట్ అవుతుందా అన్న చర్చ ప్రస్తుతం జరుగుతుంది.

మంత్రుల తీరుపై అనేక జిల్లాల్లో తీవ్ర వ్యతిరేకత
తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో మంత్రుల తీరుపై ఇదే తరహా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మంత్రులు ఆధిపత్యాన్ని చలాయించడంలో భాగంగా స్థానికంగా ఉంటున్న ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పెద్దఎత్తున చర్చ జరుగుతుంది. ఇక ఈ క్రమంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాలలో ఉన్న ఎమ్మెల్యేలు, మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేల తరహాలో తిరుగుబాటు బావుటా ఎగురవేస్తారా అన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల నుండి కీలక నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పాత, కొత్త నాయకుల కలయికతో బీఆర్ఎస్ పార్టీలో పదవుల కోసం, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం అంతర్గత యుద్ధం కొనసాగుతుంది.

జిల్లాలపై పట్టు కోసం మంత్రుల వ్యూహం.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలలో అసహనం
అంతేకాదు ఇక మంత్రులు జిల్లాపై తమ పట్టు కోసం ప్రయత్నిస్తూ, తమ అనుయాయులకు మాత్రమే నామినేటెడ్ పదవులను ఇచ్చేలా అడుగులు వేస్తున్నారు. ఇక దీనిని ఎమ్మెల్యేలు ఏమాత్రం సహించలేకపోతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అనేక సందర్భాలలో మంత్రుల తీరుపై బాహాటంగానే తమ అసహనాన్ని వెళ్లగక్కిన, విమర్శలు గుప్పించిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మంత్రుల కార్యక్రమాలకు సైతం గైర్హాజరు అయిన పరిస్థితి ఉంది. ఇక ఈ క్రమంలో ఒక్కసారిగా మేడ్చల ఎమ్మెల్యేలు మైనంపల్లి ఇంట్లో భేటీ అయిన ఘటన ఒక్కసారిగా బీఆర్ఎస్ ను ఉలిక్కిపడేలా చేసింది.

దృష్టి సారించిన గులాబీ బాస్.. ఏం చేస్తారో?
ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రధానంగా ఈ పరిస్థితులపై దృష్టి సారిస్తున్నారు. పరిస్థితులను చక్కదిద్ది కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్యను పరిష్కరించడం కోసం మాట్లాడుతున్నారు. అయితే మళ్లీ జిల్లాలకు వచ్చిన తర్వాత మాత్రం పార్టీ నేతల మధ్య సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఒకరికి ఒకరికి మధ్య సఖ్యత లేని తీరు ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కు ఆందోళన కలిగిస్తుంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని వెళుతున్న వేళ, రాష్ట్రంలో పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న అంతర్గత కలహాలు బీఆర్ఎస్ పార్టీ కి టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఏది ఏమైనా మేడ్చల్ జిల్లా సీన్ రాష్ట్రవ్యాప్తంగా రిపీట్ కాకుండా ఉండడానికి గులాబిబాస్ ఏం చేస్తారు అన్నది మాత్రం ప్రస్తుతం అందరిలో ఆసక్తికరంగా మారింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications