కాంగ్రెస్లో కేసీఆర్ 'సన్నాసి' చిచ్చు: జానా వర్సెస్ భట్టి, వీహెచ్ ఫైర్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో విభేదాలు పొడసూపాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యల నేపథ్యంలో ఇరువురు ముఖ్య కాంగ్రెస్ నేతల మధ్య శుక్రవారం నాడు పరోక్ష మాటల యుద్ధం నడిచింది. కేసీఆర్ వ్యాఖ్యల పైన విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
కేసీఆర్ వ్యాఖ్యల పైన మల్లు భట్టి విక్రమార్క గురువారం మాట్లాడుతూ.. సన్నాసి అన్నారు. దీనిపై జానా రెడ్డి శుక్రవారం స్పందించారు. ఎదుటి వారికి నీతులు చెప్పే మనం అలా వ్యవహరించడం సరికాదని భట్టి విక్రమార్కను ఉద్దేశించి అన్నారు. నేతలు హుందాగా మాట్లాడాలన్నారు.

దీనికి వెంటనే మల్లు భట్టి ఘాటుగా సమాధానం చెప్పారు. కాంగ్రెస్ సన్నాసులకు చెప్పానన్న కేసీఆర్ వ్యాఖ్యల పైన తాను మాట్లాడానని ఆయన చెప్పారు. సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన, హావభావాలు కేసీఆర్లో కనిపించడం లేదని భట్టి చెప్పారు.
కేసీఆర్ భాష మార్చుకో: వీహెచ్
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ సన్నాసి భాష మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావు చెప్పారు. మరోసారి అలాంటి భాష మాట్లాడితే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాలన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications