ఏపీకి చెందిన ఆనంద్ సాయి సహా...: కెసిఆర్ ఆదేశాలు (పిక్చర్స్)
హైదరాబాద్: యాదాద్రి దేవస్థానం అభివృద్ధికి రూపమిచ్చిన ప్రణాళికలను వేగంగా అమలు చేయాలని, వారం పది రోజుల్లో పనులను ప్రారంభించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కావాల్సినంత భూమి, నిధులు ఉన్నందున వెంటనే కార్యాచరణ చేపట్టాలన్నారు.
బుధవారం కెసిఆర్ తన నివాసంలో ఆయన దాదాపు అయిదు గంటలపాటు యాదాద్రిపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ బూర నర్సయ్య, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ, రూప శిల్పులు జగన్, ఆనంద్సాయి తదితరులు పాల్గొన్నారు.
గుట్ట చుట్టూ ఇప్పటికే 945.2 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని, మరో వందెకరాలు సేకరించి, మొత్తాన్ని ఆలయ అభివృద్ధికే కేటాయిస్తామన్నారు. గుట్టకు రెండేళ్ల బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించామని, దీనికితోడు టాటా, అంబానీలతో పాటు జెన్కో, భెల్ వంటి సంస్థలు రూ.500కోట్లను విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చాయన్నారు.

యాదాద్రి
యాదాద్రి గొప్ప ఆధ్యాత్మిక, పర్యాటకకేంద్రంగా మారాలని, ప్రస్తుతం గుట్టపై 15 ఎకరాల స్థలం ఉందని, వీటిలో అయిదు ఎకరాలు ప్రధాన ఆలయానికి వస్తుందని, ఇందులోనే ప్రాకారం, మాఢవీధులు నిర్మించాలని, లక్ష్మీనర్సింహస్వామి 32 అవతారమూర్తులు ఇందులోనే ఉండాలని చెప్పారు.

యాదాద్రి
యాదాద్రి గుట్ట విస్తీర్ణం దాదాపు 180 ఎకరాలని, దీన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు.గుట్ట చుట్టూ గిరిప్రదక్షిణ రోడ్డును నిర్మించాలన్నారు.

యాదాద్రి
గుట్ట పైనే పుష్కరిణి, కళ్యాణకట్ట, అర్చకుల నివాసగృహాలు, రథమండపం, క్యూ కాంప్లెక్స్, వీపీఐ అతిథి గృహం, దేవుని ప్రసాదాలు తయారు చేసే వంటశాల, అద్దాల మందిరం నిర్మించాలని, గుట్ట కింది భాగంలో బస్స్టాండ్, కళ్యాణమంటపం, దుకాణాల సముదాయం, పూజలకు ఉపయోగించే చెట్ల పెంపకానికి ఉద్యానవనం ఏర్పాటు చేయాలి. మండలదీక్షలు తీసుకునేవారి కోసం వసతికేంద్రాలు నిర్మించాలన్నారు.

యాదాద్రి
యాదాద్రి చుట్టూ ఉన్న ఇతర కొండలు, ఖాళీ ప్రదేశాల్లో ఉద్యానవనాలు, కాటేజీలు, అతిథి గృహాలు, పార్కింగు స్థలాలు, గోశాల, అన్నదాన భోజనశాల, శాశ్వత హెలిప్యాడ్ను నిర్మించాలన్నారు.

యాదాద్రి
బస్వాపూర్ రిజర్వాయర్ యాదాద్రికి సమీపంలోని బస్వాపూర్ చెరువును రిజర్వాయర్గా మారుస్తామని, నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అక్కడే బోటింగు, జల క్రీడలను ఏర్పాటు చేయాలన్నారు.

యాదాద్రి
కట్టను హైదరాబాద్ ట్యాంక్ బండ్ మాదిరి తీర్చిదిద్దాలని, గుట్ట ప్రాంతమంతా నాలుగు వరసల రహదారి ఏర్పడాలని, ప్రతీ రహదారికి డివైడర్, కాలిబాట విధిగా ఉండాలని, అధ్యాత్మికం, ఆహ్లాదం, ఆనందం, పచ్చదనం వెల్లివిరిసేలా యాదాద్రి రూపుదిద్దుకోవాలని, వేయి ఎకరాల స్థలాన్ని జోనింగు చేసి, లేఅవుట్ను సిద్ధం చేయాలన్నారు.

యాదాద్రి
యాదాద్రికి సమీపంలోని 11ఎకరాల స్థలంలో మూడు అతిథిగృహాలను నిర్మించాలని, పుష్కరిణిని విస్తరించాలని, గుట్ట సమీపంలోని దేవాలయాలను అభివృద్ధి చేయాలని, పాత యాదగిరిని అంతా సందర్శించుకునేలా సౌకర్యాలు కల్పించాలని సీఎం సూచించారు.

యాదాద్రి
యాదాద్రి దేవస్థానం అభివృద్ధికి రూపమిచ్చిన ప్రణాళికలను వేగంగా అమలు చేయాలని, వారం పది రోజుల్లో పనులను ప్రారంభించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications