ఉద్యోగాలు పోగొట్టుకునేవారే సమ్మె చేయండి: ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ వార్నింగ్
హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెను విరమించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కోరారు. ఆర్టీసీలో సమ్మెను నిషేధించామని చెప్పారు. ఆర్టీసీని కాపాడుకోవడమే తమ ధ్యేయమన్నారు. జూన్ 11 నుంచి ఆర్టీసీ యూనియన్లు సమ్మె చేస్తామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.

రూ.700కోట్ల నష్టంతో నడుస్తోందని.. ఇలాంటి సమస్యంలో సమ్మె నోటీసులు ఇవ్వడం బాధ్యతారాహిత్యమని అన్నారు. యూనియన్ నాయకుల మాట విని ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొనవద్దని అన్నారు.
ఉద్యోగాలు పోగొట్టుకునే కార్మికులే సమ్మెకు దిగాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ఒకవేళ సమ్మె జరిగితే ఇదే చివరి సమ్మె అవుతుందని హెచ్చరించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్టీసీ కార్మికులకు 44శాతం జీతాలు పెంచామని అన్నారు. రెండేళ్లు సమయం ఇచ్చినా నష్టాల నుంచి బయటపడలేదని, ఎలాంటి ఫలితం లేదన్నారు.












Click it and Unblock the Notifications