ఏపీలో పోటీ తక్కువ, కోటా పెంచండి: సుష్మకు కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణకు హజ్ యాత్రికుల కోటాను పెంచాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కు ఆదివారం నాడు లేఖ రాశారు. తెలంగాణలో 1,223 స్లాట్లకుగాను 15,419 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో ఒక్కో స్లాట్కు 12 మంది పోటీ పడుతున్నారని, అదే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక స్లాట్కు ఇద్దరు మాత్రమే పోటీ పడుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణకు మరో 2 వేల స్లాట్లు పెంచేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సుష్మా స్వరాజ్కు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ నుండి హజ్ వెళ్లే యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అనుమతులు రాలేదన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మొత్తం ఏపీ, తెలంగాణల్లోని 6043 మంది యాత్రికులకు అనుమతి లభించిందని, ఈ సంవత్సరం కోటాను 4945కి తగ్గించడం తమకు విస్మయం కలిగించిందన్నారు.
ఈసారి మొత్తం కోటాలో 2700 ఏపీకి, 2245 తెలంగాణకు కేటాయించారన్నారు. తెలంగాణ నుండి హజ్ యాత్రకు బాగా డిమాండ్ ఉందన్నారు. తెలంగాణలో ఒక్కో సీటుకు 12 మంది, హైదరాబాదులో అయితే 23 మంది పోటీ పడుతున్నారన్నారు. తెలంగాణలో డిమాండ్ దృష్ట్యా తమకు 2000 స్లాట్లు పెంచాలని కోరారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications