కాంగ్రెస్ సర్కారు మరో మోసం: బాధాకరమంటూ కిషన్ రెడ్డి
బోనస్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మరోసారి మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు మందకొండిగా సాగుతున్నాయన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 75 వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని, ఇలా అయితే మొత్తం ధాన్యం కొనేందుకు మరో 2 నెలలు పడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం 50 లక్షల టన్నుల వడ్లు కొనేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల ప్రచారంలో వరి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

ఇప్పుడేమో సన్న వడ్లకు మాత్రమే ఇస్తాననడం బాధాకరమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ధాన్యం తడిచి మొలకెత్తుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు గాస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. సన్న బియ్యం, దొడ్డు బియ్యం అని రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆగామాగం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను, ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. వరి రకాలకు తేడా లేకుండా ప్రతి రైతుకు బోనస్ ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు.
-
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే!












Click it and Unblock the Notifications