రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణలో తాము 8 -12 ఎంపీ స్థానాలు గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ చేసిన కామెంట్స్ పైన కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశం పైన స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ కు సవాల్ చేసారు.
రాజీనామాకు సిద్దం
బీఆర్ఎస్ 8 ఎంపీ సీట్లు గెలిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ చేసారు. బీఆర్ఎస్ 8 నుండి 12 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఓ టీవీ ఛానెల్ డిబేట్లో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల పైన కోమటిరెడ్డి స్పందించారు. కేసీఆర్ చెప్పినట్లుగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 ఎంపీ సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామాకు సిద్దమన్నారు. కేసీఆర్ అన్నీ అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. నల్గొండలో కేసీఆర్ ఫ్లోరైడ్ సమస్య పరిష్కరించలేదన్నారు.

టచ్ లో ఉందెవరో చెప్పాలి
25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్లోకి 25 మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నారని చెప్పుకొచ్చారు. ఆ 25 మంది ఎమ్మెల్యేల పేర్లు తాను చెబుతానని... మరీ కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి వెళ్లే పాతిక మంది ఎమ్మెల్యేల పేర్లు కేసీఆర్ చెప్పాలని సవాల్ చేసారు. తాము అర్భకులం కాదని.. అర్జునులమై అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడతామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 12 ఎంపీ సీట్లు గెలుస్తోందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేసారు.

తప్పు చేస్తే తప్పదు
సీఎం అయినా..ఎమ్మెల్సీ అయినా తప్పు చేస్తే జైలుకు వెళ్లాల్సిందే అన్నారు. రూల్స్ అందరికీ ఒకేలా ఉంటాయి..ఇదికూడా కేసీఆర్కు తెలియదా అని నిలదీసారు. ఫోన్ ట్యాపింగ్ బాధ్యత అప్పటి ప్రభుత్వానిదే అంటూ మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్పై కేసీఆర్ తెలిసే మాట్లాడుతున్నారా అని సందేహం వ్యక్తం చేసారు. ఎమ్మెల్సీ కవిత ఏ ముత్యమో త్వరలో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ అమలు చేసే హామీలే ఇచ్చింది అంటూ కోమటిరెడ్డి పేర్కొన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications