నల్గొండలో హరీశ్రావు సభ కోసం కోమటిరెడ్డి జన సమీకరణ!..
నల్గొండ జిల్లా, నార్కట్పల్లి మండల పరిధిలోని బ్రాహ్మణవెల్లెం గ్రామంలో నిర్మిస్తున్న ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని జూన్ నాటికి పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు గతంలో ప్రకటించిన సంగతి
నల్గొండ: నల్గొండ జిల్లా, నార్కట్పల్లి మండల పరిధిలోని బ్రాహ్మణవెల్లెం గ్రామంలో నిర్మిస్తున్న ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని జూన్ నాటికి పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సమయం దగ్గరపడటంతో.. పనులను మరోసారి స్వయంగా పరిశీలించేందుకు ఆయన నల్గొండలో పర్యటించనున్నారు.
నల్గొండ పర్యటనలో భాగంగా ఉదయ సముద్రం పనుల పరిశీలనతో పాటు, బత్తాయి మార్కెట్ ను హరీశ్ రావు ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసే సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సభ కోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి జనసమీకరణ చేస్తుండటం గమనార్హం.

బత్తాయి మార్కెట్, ఉదయసముద్రం ప్రాజెక్టు సాధనే తన జీవితాశయమన్న కోమటిరెడ్డి.. మార్కెట్ ప్రారంభోత్సవానికి వస్తున్న హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ యార్డు ప్రారంభం సందర్భంగా.. రాజకీయాలకు అతీతంగా రైతులు తరలిరావాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు.
మరోవైపు టీఆర్ఎస్ శ్రేణులు కూడా జనసమీకరణకు దిగడంతో.. కొంత టెన్షన్ వాతావరణం అక్కడ నెలకొంది. హరీశ్ రావుతో పాటు మరో మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ శ్రేణులకు, టీఆర్ఎస్ శ్రేణులకు ఎక్కడా ఘర్షణ చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి.












Click it and Unblock the Notifications