కొండా సురేఖకు మరో షాక్.. వరంగల్ లో అనూహ్య పరిణామం!
మంత్రి కొండా సురేఖ ఊహించని కష్టాలలో పడుతున్నారా? మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి అనేక కాంట్రవర్సీ లతో ఇబ్బంది పడుతున్న కొండా సురేఖ తాజాగా సొంత నియోజకవర్గంలో కూడా ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారు. అనుచరగణం బలంగా ఉందని చెప్పుకునే కొండా సురేఖ ప్రధాన అనుచరులను కోల్పోతున్నారు.
కొండా కపుల్ వ్యవహార శైలిపై చర్చ
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వర్గపోరు, చిలికి చిలికి గాలి వానగా మారి కొండా కపుల్ దంపతుల వ్యవహార శైలి పైన రాజకీయంగా చర్చకు కారణమవుతుంది. గత ఎన్నికలలో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి తర్వాత కొండా సురేఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రి అయిన తర్వాత కేటీఆర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు, సమంత వ్యవహారంలో నాగార్జున కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో వరుస వివాదాలలో చిక్కుకున్నారు.

ఎవరితోనూ సఖ్యత లేని కొండా సురేఖ
జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి వంటి నాయకులతో నే కాకుండా, స్థానికంగా ఉన్న బస్వరాజు సారయ్య, గుండు సుధారాణి వంటి వారితో కూడా కయ్యానికి కాలు దువ్వారు. ఏకంగా ఆమె కుమార్తె సీఎం రేవంత్ రెడ్డి పైనే అనుచిత వ్యాఖ్యలు చేసింది. మొత్తం జిల్లా కాంగ్రెస్ అంతా ఒకవైపు ఉంటే కొండా సురేఖ వర్గం ఒకవైపు గా కొంతకాలంగా ప్రచ్చన్నయుద్ధం కొనసాగుతుంది.
కొండా అనుచరులపై పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు
కాంగ్రెస్ అధిష్టానానికి వరుస ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకు వారి వ్యవహారంలో కఠిన నిర్ణయం తీసుకోకపోవడంతో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులలో కొంత అసంతృప్తి ఉంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఏకతాటి మీద ముందుకు తీసుకు వెళ్ళవలసిన మంత్రి ఆ బాధ్యతను నిర్వర్తించకుండా ఉండడమే కాకుండా, అనుచరులను పార్టీలో ఉన్న నాయకులను రెచ్చగొట్టి ఘర్షణ వాతావరణం సృష్టిస్తుండటంతో ఆమె అనుచరుల పైన పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువగా మారుతున్నాయి.
కొండా ప్రధాన అనుచరుడు నవీన్ రాజ్ పై కేసు
కాంగ్రెస్ పార్టీ 25వ డివిజన్ అధ్యక్షుడిని కత్తితో బెదిరించినట్టు, దాడికి పాల్పడినట్టు కొండా సురేఖ ప్రధాన అనుచరుడు నవీన్ రాజ్ మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఇక ఇదే సమయంలో ఎంతోకాలంగా కొండా దంపతులకు ప్రధాన అనుచరుడిగా ఉన్న నల్లగొండ రమేష్ వరంగల్ తూర్పులో నవీన్ రాజ్ తీరుతో, కొండా దంపతుల వైఖరితో కొండా ఫ్యామిలీని వీడి బస్వరాజు సారయ్య గూటికి చేరారు.
సారయ్య గూటికి చేరుతున్న కొండా అనుచరులు
బస్వరాజు సారయ్య ఎటువంటి వివాదాలలోనూ జోక్యం చేసుకోని వ్యక్తి కావడంతో కొండా వర్గంలో వారి వైఖరి నచ్చని వారు ఆయన వైపుకు చేరుతున్నారు. ఇప్పటికే తాజాగా డిసిసి అధ్యక్షుడిగా నియామకమైన ఆయుబ్ సారయ్య డైరెక్షన్స్ తో నడుస్తూ ఉండగా, మరికొంతమంది సారయ్య నాయకత్వంపైన నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ పరిణామాలు వరంగల్ తూర్పులో కొండా సురేఖ పట్టు తగ్గిస్తున్నాయి అని చెప్పడం నిర్వివాదాంశం.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications