సుప్రీం కోర్టులో తెలంగాణకు కేంద్రం షాక్: 4రాష్ట్రాలకు కాదు.. ఏపీతో చాలు!
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది! కృష్ణా నది నీటి పంపిణీ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. దీనిపై మంగళవారం నాడు సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం తన వాదనలు వినిపించింది.
కృష్ణా నది నీటిని నాలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో నీటిని మళ్లీ నాలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కోరింది. ఇందుకు కొత్త ట్రైబ్యునల్ అవసరమని చెప్పింది.

అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించింది. తెలంగాణ కోరినట్లు కొత్త ట్రైబ్యునల్ అవసరం లేదని సుప్రీం కోర్టుకు విన్నవించింది. కృష్ణా నది నీటి పంపకాన్ని రెండు రాష్ట్రాలకు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) పరిమితం చేస్తే చాలని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నీటి పంపిణీ చేయాలని కోరింది. కాగా, కృష్ణా నది నీటిని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని ఏపీ చెబుతుండగా, నాలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని తెలంగాణ కోరుతోంది. ఇన్నాళ్లు దీని పైన కేంద్రం మిన్నకుండింది. ఇప్పుడు రెండు రాష్ట్రాలకే పరిమితం చేయాలని కోరింది. సుప్రీం కోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications