సీఎం కేసీఆర్ చొరవ.. జూరాలకు చేరుతున్న కృష్ఱా జలాలు
మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లా వాసుల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. సీఎం కేసీఆర్ చొరవతో నీటి విడుదలకు కర్ణాటక ముఖ్యమంత్రి ఓకే చెప్పిన నేపథ్యంలో.. కృష్ణా జలాలు జూరాల ప్రాజెక్టుకు చేరుకుంటున్నాయి. వేసవికాలంలో నీటి ఎద్దటి దృష్ట్యా రెండున్నర టీఎంసీల నీళ్లు ఇచ్చేందుకు కర్ఱాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అంగీకారం తెలిపారు. ఆ మేరకు మూడు రోజుల కిందట నీటిని విడుదల చేశారు అక్కడి అధికారులు. సోమవారం నాడు కృష్ణా జలాలు నారాయణపేట జిల్లాలోకి ప్రవేశించాయి.

పాలమూరు నీటి కష్టాలు.. కేసీఆర్ చొరవ
పాలమూరు జిల్లా ప్రజలు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఎగువన ఉన్న కర్ణాటక నుంచి నీరు తెచ్చుకుంటే తప్ప సమస్యకు పరిష్కారం లేదని ఆలోచించారు. ఆ క్రమంలో కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాయడంతో పాటు స్వయంగా అక్కడి సీఎం కుమారస్వామికి ఫోన్ చేశారు. మే 3వ తేదీన ఆయనకు కేసీఆర్ ఫోన్ చేసిన నేపథ్యంలో నీళ్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదు కావడం.. దానికి తోడు ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో భూగర్భ జలాలు ఇంకిపోయాయి.
జిల్లా పరిధిలోని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో జిల్లావాసులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ క్రమంలో కేసీఆర్ వినతి మేరకు కర్ణాటకలోని నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు 2.5 టీఎంసీల నీటి విడుదలకు కుమార స్వామి ఓకే చెప్పారు.

జూరాలకు కృష్ణా జలాలు
నీటి విడుదల కోసం కేసీఆర్ లేఖ రాసిన నేపథ్యంలో.. కర్ణాటక అధికారులతో కుమారస్వామి చర్చించారు. నారాయణపూర్ రిజర్వాయర్ లో నీటి లభ్యత ఉన్న కారణంగా.. పాలమూరుకు నీళ్లు ఇచ్చేందుకు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేస్తామని స్వయంగా ఆయనే ఫోన్ చేసి చెప్పడం విశేషం.
కుమారస్వామి ఆదేశాలతో కర్ణాటక అధికారులు మూడు రోజుల కిందట పాలమూరుకు నీటిని విడుదల చేశారు. దాంతో సోమవారం (13.05.2019) నాడు కృష్ణా జలాలు నారాయణపేట జిల్లాలోకి ప్రవేశించాయి. మొదటిరోజు 2 వేల 110 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, మర్నాడు 8 వేల క్యూసెక్కులు రిలీజ్ చేశారు. అలా రెండున్నర టీఎంసీల నీరును ఇప్పటికే అక్కడి అధికారులు రిలీజ్ చేశారు. మంగళవారం (14.05.2019) నాటికి జూరాల ప్రాజెక్టుకు కృష్ణా జలాలు చేరుకోనున్నాయి.

ఒకరికొకరు..!
పోయినేడాది తుంగభద్ర జలాల్లో ఆర్డీఎస్ వాటా నుంచి.. ఒక టీఎంసీ నీటిని వాడుకుంటామన్న కర్ణాటక ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ ఓకే చెప్పింది. ఆ క్రమంలోనే జూరాలకు నీటి విడుదలపై కేసీఆర్ లేఖ రాయగానే కుమారస్వామి వెంటనే స్పందించారనే టాక్ నడుస్తోంది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టులో 37.64 టీఎంసీల సామర్థ్యానికిగాను ప్రస్తుతం 18.06 (50శాతం) టీఎంసీల నీరు నిల్వ ఉంది. అందులో నుంచి రెండున్నర టీఎంసీలు జూరాల ప్రాజెక్టుకు విడుదల చేశారు. మొత్తానికి ఈ నీటితోనైనా జిల్లావాసుల తాగునీటి కష్టాలు తీరుతాయామో చూడాలి.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications