నాగార్జున సాగర్ వద్ద ఉప్పొంగుతున్న కృష్ణమ్మ.. మొత్తం 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
నాగార్జున సాగర్ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ ఏడాది జులై పూర్తయ్యే నాటికే నాగార్జున సాగర్ లో పూర్తి స్థాయి నీటి మట్టానికి నీరు చేరుకుంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత జులై నెలలో సాగర్ పూర్తి స్థాయిలో నిండిపోయింది. తాజాగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద భారీగా నమోదవుతోంది. దీంతో నాగార్జునసాగర్ లో నీటిమట్టం క్రమంగా పెరిగిపోయింది. దీంతో ప్రస్తుత సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉండగా.. ప్రస్తుతం 586.20 అడుగులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.
ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జులై పూర్తయ్యే నాటికే నాగార్జున సాగర్ లో పూర్తి స్థాయి నీటి మట్టానికి నీరు చేరుకుంది. దీంతో తెలంగాణ మంత్రులు 14 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. జులైలోనే నాగార్జున సాగర్ నిండటం 18 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో నాగార్జున సాగర్ ను సందర్శించిన తెలంగాణ మంత్రులు.. మొత్తం 8 గేట్లు 8 ఫీట్లు పైకి ఎత్తి 68 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు.

ఈ మేరకు 10, 11, 12, 13, 14, 15, 16, 17 గేట్లు ఎత్తారు. ఈసారి మహారాష్ట్ర, కర్ణాటక సహా రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో జలాశయానికి భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. సాగర్ వద్ద కృష్ణమ్మ ఉరకలెత్తి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ పరవళ్లను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జున సాగర్ లో జల సందడి నెలకొంది.
Telangana: Nagarjuna Sagar gates open after 18 years With massive inflows from upstream, the reservoir is full to the brim. Ministers Uttam Jumar Reddy & Adluri Laxman, along with officials, opened the crest gates to release floodwaters
— Deccan Chronicle (@DeccanChronicle) July 29, 2025
(Video courtesy : X)#NagarjunaSagar… pic.twitter.com/OJ1cFlRRHo
మరోవైపు శ్రీశైలం క్యాచ్ మెంట్ ఏరియాలో భారీ వర్షాల పడటం వలన శ్రీశైలం డ్యామ్ ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఓ సారి గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. తాజాగా వస్తోన్న వరద ప్రవాహాంతో 8 రేడియల్ క్రస్టు గేట్లను పది అడుగుల మేర ఎత్తి, నీటికి కిందకు వదులుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications