ఆ సమస్యపై..: కేటీఆర్కు యాంకర్ ప్రదీప్ ట్వీట్, క్షణాల్లో స్పందన..
Recommended Video

హైదరాబాద్: సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ ద్వారా తన దృష్టికి వచ్చే సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు. అధికారులను పురమాయించి యుద్దప్రాతిపదికన సమస్య పరిష్కారానికి చొరవ చూపిస్తున్నారు. తాజాగా టీవీ యాంకర్ ప్రదీప్ ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి ఓ సమస్యను తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. అధికారులను చర్యలకు ఆదేశించారు.
'టాయిలెట్ లేని పాఠశాల' :
'టాయిలెట్ లేని పాఠశాల' పేరుతో ఓ స్వచ్చంద సంస్థ ట్విట్టర్ లో ఒక పోస్టు పెట్టింది. చర్లపల్లిలో 40ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాలకు ఇప్పటికీ టాయిలెట్ వసతి లేదని, స్కూల్లో చదువుకుంటున్న 120మంది బాలికలు, 100మంది బాలురు ఇబ్బందులు పడుతున్నారని ట్వీట్ ద్వారా ఆ ఎన్జీవో తెలియజేసింది.
టాయిలెట్ లేని కారణంగా విద్యార్థులు భోజనం తర్వాత మంచినీళ్లు కూడా తాగడం లేదని.. నీళ్లు తాగితే టాయిలెట్ కోసం చాలాదూరం వెళ్లాల్సి వస్తోందన్న కారణంతోనే ఇలా చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ఈ ట్వీట్కు కేటీఆర్ను కూడా ట్యాగ్ చేసింది.
కేటీఆర్కు ప్రదీప్ విజ్ఞప్తి:
ఎన్జీవో చేసిన ట్వీట్పై యాంకర్ ప్రదీప్ మాచిరాజు స్పందించారు. తమ టీమ్ ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి సమస్యను పరిశీలించిందని.. నిజంగానే అక్కడ చాలా సమస్యలు ఉన్నాయని, ప్రధానంగా బాలికల సమస్య కోసం ఏదైనా చేయాలని ట్విట్టర్ ద్వారా ఆయన కేటీఆర్ను కోరారు.
చర్యలకు కేటీఆర్ ఆదేశం..:
ప్రదీప్ ట్వీట్పై కేటీఆర్ స్పందించారు. తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు.. పని పూర్తయ్యాక ఆ ఫోటోల్ని కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని అన్నారు. అందుకు అనుగుణంగా మేడ్చల్ కలెక్టర్ నుంచి కూడా స్పందన రావడం విశేషం. 'సార్.. డీఈవో రేపు వెళ్లి ఆ పాఠశాల టాయిలెట్లను పరిశీలిస్తారు. పాత టాయిలెట్ల స్థానంలో కొత్తవి నిర్మించడానికి చర్యలు తీసుకుంటాం' అంటూ ట్వీట్ చేశారు.
కేటీఆర్కు 10 లక్షలు ఫాలోవర్స్
ట్విట్టర్లో కేటీఆర్ దూసుకెళ్తున్నారు. ఆయన ఫాలోవర్స్ సంఖ్య ఇటీవలే 10 లక్షలు దాటింది. ఈ సందర్భంగా తనను ఫాలో అవుతున్న నెటిజన్స్ అందరికీ మిలియన్ థ్యాంక్స్ చెప్పారు కేటీఆర్. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించేందుకు.. అభివృద్ధి పనులను తెలియజేసేందుకు ఆయన ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications