KTR: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: కేటీఆర్
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో రూ.7000 కోట్ల స్థిర మూలధనాన్నికేటాయించిందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో కోకాకోలా, పెప్సికో, ఐటీసీ తదితర పరిశ్రమలు ఉన్నయని పేర్కొన్నారు. వ్యవసాయం, పాడిపరిశ్రమ, మాంసం, మత్స్య రంగాల్లో ఒకేసారి ఐదు విప్లవాలకు నాంది పలుకుతున్నట్లు తెలిపారు. ఫుడ్ కాన్క్లేవ్ 2023 మొదటి ఎడిషన్ను కేటీఆర్ శనివారం ప్రారంభించారు.
ఈ కాన్క్లేవ్ కేవలం వాణిజ్య అవకాశాలను అన్వేషించడమే కాకుండా ఆహార ఉత్పత్తి, ప్రాసెసింగ్ పరంగా దేశాన్ని వన్-స్టాప్ గమ్యస్థానంగా మార్చడానికి, మిగిలిన ఆహార అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఫుడ్ కాంక్లేవ్ అన్ని ఆహార పరిశ్రమల కంపెనీలకు గో-టు డెస్టినేషన్గా మారుతుందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు వల్ల 50,000 ఉద్యోగాలను వస్తాయని చెప్పారు. "తెలంగాణ భారతదేశానికి సీడ్ బౌల్, భారతదేశం పౌల్ట్రీ రాజధాని, తెలంగాణ గతంలో న్యూట్రాస్యూటికల్స్ హబ్గా ఉంది. త్వరలో ఆ స్థానాన్ని తిరిగి పొందుతుంది" అని మంత్రి తెలిపారు.

దేశంలో చేపల పెంపకంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలో పశుసంపద, ముఖ్యంగా గొర్రెలు, మేకల సంఖ్యను రెట్టింపు చేసిందన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ, అటవీ విశ్వవిద్యాలయాలను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ఊతమివ్వడానికి రాష్ట్రం తీసుకుంటున్న చొరవను నొక్కిచెప్పిన కేటీఆర్, తెలంగాణ ఉత్పత్తి పరంగా విప్లవాలకు నాంది పలకడమే కాకుండా పరిశ్రమల ప్రయోజనాల కోసం టాలెంట్ పూల్ను ఉత్పత్తి చేసే పర్యావరణ వ్యవస్థను కూడా సృష్టిస్తోందని అన్నారు.
దేశంలోనే అత్యుత్తమ విధానాల్లో టీఎస్-ఐపాస్ ఒకటని కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే 10,000 ఎకరాల భూమిని సేకరించామన్నారు. ప్యాకేజ్డ్, కస్టమైజ్డ్ ఇన్సెంటివ్లతో పరిశ్రమలకు దీన్ని విస్తరించడానికి మేము సిద్ధంగా ఉన్నట్ల మంత్రి చెప్పారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలలో అద్భుతాలను ఎలా సృష్టించవచ్చు, సూక్ష్మ పారిశ్రామికవేత్తలను ఎలా ప్రోత్సహించాలనే దానిపై దేశంలోని మిగిలిన వారు నేర్చుకోవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications