ఆటో ఎక్కిన కేటీఆర్.. ఎందుకో తెలుసా!!
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ నాయకులు కొత్త పంధాలో పయనిస్తున్న విషయం తెలిసిందే. భారీ కాన్వాయ్, ఫుల్ సెక్యూరిటీతో ఉండే బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం రూటు మార్చారు. సామాన్య ప్రజలతో మమేకమవుతూ సామాన్య ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా ఆటోలో ప్రయాణం చేశారు.
రానున్న పార్లమెంటు ఎన్నికలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించిన కేటీఆర్, తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అసెంబ్లీ సమీక్ష సమావేశాలను కేటీఆర్ నిర్వహించారు. హైదరాబాద్ యూసఫ్ గూడా లో నిర్వహించిన జూబ్లీహిల్స్ సమీక్ష సమావేశంలో పలు అంశాల పైన కేటీఆర్ చర్చించారు.

ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత కేటీఆర్ తన కారులో వెళ్లకుండా ఆటోలో ప్రయాణం చేశారు. కేటీఆర్ తెలంగాణ భవన్ కు ఆటోలోనే వెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచితబస్సు పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆటోవాలాల జీవనం దుర్భరంగా మారింది. ప్రస్తుతం ఆటోవాలాలు తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేకమార్లు ఆటోవాలాలు ఆందోళనలు చేసి ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేశారు.
బిఆర్ఎస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ సమీక్ష సమావేశం ముగిసిన తరువాత యూసఫ్ గూడ నుండీ తెలంగాణ భవన్ కు ఆటోలో వెళ్లిన కేటీఆర్..!! pic.twitter.com/jqocMsXIZU
— oneindiatelugu (@oneindiatelugu) January 27, 2024
ఇక ఆటోవాలాలకు అండగా గతంలోనే తన వాయిస్ వినిపించిన కేటీఆర్ తాజాగా ఆటోలో ప్రయాణం చేసి మరోమారు ఆటోవాలాలకు మద్దతు తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా ఆటోలో ప్రయాణం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం తర్వాత ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని కేటీఆర్ విమర్శించారు.
ఈ క్రమంలోనే ఆయన ఆటోలో ప్రయాణం చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ ఆటోలో ప్రయాణం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
-
KTR on Speaker Decision: దానం, కడియంకు క్లీన్ చిట్టా ? కేటీఆర్ షాకింగ్ ..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications