ఎటు వెళ్తే అటు: పోకిరీని చెప్పు తీసి కొట్టింది (ఫోటో)
నల్గొండ: తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఓ మహిళా కండక్టర్ పోకిరీకి చెప్పుదెబ్బలతో బుద్ధి చెప్పారు. గత కొద్ది రోజులుగా ఆమెను ఓ యువకుడు వేధిస్తున్నాడు.
దీంతో ఆమె అతనికి బుద్ధి చెప్పింది. నల్గొండ బస్టాండ్ వద్ద సోమవారం ఇది జరిగింది. భువనగిరి ప్రాంతానికి చెందిన రాంబాబు అనే డిగ్రీ విద్యార్థి చివరి సంవత్సరం చదువుతున్నాడు.

అతను కొద్ది రోజుల నుండి ఆ మహిళా కండక్టర్ను ఫాలో అవుతున్నాడు. ఏ రూట్లో డ్యూటీ వేస్తే ఆ రూట్లో ఆమెను అనుసరిస్తున్నాడు. దీంతో ఆమె నల్గొండ బస్టాండ్ వద్ద అతనిని చెప్పుతో కొట్టారు. స్థానికులతో కలిసి పోలీసులకు అప్పగించారు.













Click it and Unblock the Notifications