రూ. 10 క్ష బంగారు ఆభరణాల చోరీ: క్లూస్టీంతో ఆధారాలు సేకరించిన పోలీసు
రూ. 10 క్ష విలువైన నగలు, లక్ష్మీ విగ్రహం చోరీ అయ్యాయని మానుకోట డీఎస్పీ రాజమహేంద్రనాయక్ తెలిపారు.
మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన అంకతి సురేందర్ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున రూ. 10 క్ష విలువైన బంగారు నగలు, వెండితో తయారు చేయించినన లక్ష్మీ విగ్రహం చోరీ అయ్యాయని మానుకోట డీఎస్పీ రాజమహేంద్రనాయక్ తెలిపారు.
డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం- శ్రీనగర్ కానీలో అంకాతి మల్లయ్య మూడు రోజు క్రితం చివరి శ్రావణ శుక్రవారం రోజు కావడంతో హైదరాబాద్లోని తన పెద్ద కుమార్తె సుష్మను పిలిపించి ఇంట్లో లక్ష్మీదేవి వ్రతం నిర్వహించారు. వ్రతం చేస్తున్న క్రమంలో ఇంట్లో ఉన్న 13 తులాల మూడు వరుస గొలుసు, ఆరు తులా గుండ్ల హారం, రెండు తులాల సాధారణ గొలుసు, రెండు తులాల చెవి కమ్మలు, బుట్టు, రెండు తులాల చెంపచేరాలు, 5 తులాల నల్లపూస గొలుసు అమ్మవారికి అలంకరించారు. 8 తులా వెండితో లక్ష్మీదేవి విగ్రహాన్ని అమ్మవారి వద్ద ఉంచారు.

హిందువు సాంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవికి అలంకరించిన నగలు మూడు రోజు వరకు అలాగే ఉంచాలి. ఆదివారం రోజు గడిస్తే నగలను అమ్మవారి విగ్రహం నుంచి తీసకొనేవారు. శనివారం రాత్రి భార్య గీత పెద్ద కుమార్తె సుష్మ, చిన్న కుమార్తెతో పాటు 12 గంట వరకు టీవీ చూస్తూ గడిపారు. అనంతరం సురేందర్ రాత్రి తెల్లవారుజామున 3 గంట వరకు టీవీ చూస్తూ మెలుకువగానే ఉన్నాడు.
ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించిన సురేందర్ తెల్లవారుజామున 6 గంటకు బాత్ రూంకు వెళ్లేందుకు బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే పూజగది తలుపు తెరిచి ఉండం విగ్రహానికి నగలు లేకపోవడంతో భార్య గీతను నగలు తీశావా అని అడిగాడు. దీంతో భార్య గీత తీయలేదని చెప్పడంతో అమోమయానికి గురయ్యారు. వెంటనే కాలనీవాసులను పిలిచి విషయాన్ని తెలిపారు. దీంతో సురేందర్ పోలీసుకు సమాచారం అందించారు.
దీంతో డీఎస్పీ రాజమహేంద్రనాయక్, టౌన్ సీఐ జబ్బార్, ఎస్సై తిరుపతితో రంగప్రవేశం చేసి సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఇంటికి ఎవరెవరు వచ్చారనే కోణంలో విచారణ చేపట్టారు. కేసును ఛేదించేందుకు వరంగల్ నుంచి క్లూస్టీంను రప్పించి వివరాలను సేకరించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఇప్పటికి కొంత సమాచారం లభించిందని, క్లూస్టీం సేకరించిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి త్వరలోనే కేసును ఛేదిస్తామని తెలిపారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications